ఏపీలో 44 బార్లకు ఈ-వేలం
- April 03, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో లైసెన్సు ఫీజు, నాన్-రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, బిడ్ అమౌంట్ చెల్లించని బార్లను ఈ-వేలం ద్వారా ఔత్సాహికులకు కేటాయించేందుకు మద్యనిషేధ, అబ్కారీ శాఖ సంచాలకులు నోటిఫికేషన్ జారీ చేశారు.ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 44 బార్లను ఈ-వేలం, ఆన్లైన్ లాటరీ పద్ధతిలో కేటాయించనున్నారు. బార్ల లైసెన్సులు పొందేందుకు ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 1 నుంచి 7 వరకు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.దరఖాస్తు రుసుమును ఏప్రిల్ 8లోగా చెల్లించాల్సి ఉంటుంది.
ఫీజులు & రిజిస్ట్రేషన్ ప్రక్రియ:
50,000 జనాభా ఉన్న ప్రాంతాల్లో → రూ.5 లక్షలు 50వేలు - 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో → రూ.7.5 లక్షలు 5 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో → రూ.10 లక్షలు ఆన్లైన్ వేలం ప్రక్రియలో అధిక మొత్తంలో బిడ్ వేసిన అభ్యర్థికి ఏప్రిల్ 9న బార్ లైసెన్స్ కేటాయించనున్నారు. ప్రాంతాల వారీగా బార్ల వివరాలు, ఆఫ్సెట్ ధరలు, గెజిట్ నోటిఫికేషన్ వివరాలను అధికారిక వెబ్సైట్http://apcpe.aptonline.in లో అందుబాటులో ఉంచారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్