చెక్కు ఫోర్జరీ..బాధితుడికి QR2 మిలియన్ పరిహారం..!!
- April 28, 2025
దోహా, ఖతార్: ఖతార్లోని కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ చెక్ ఫోర్జరీ బాధితుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. గ్యారెంటీ చెక్కును మోసపూరితంగా మార్చిన వారికి జైలు శిక్ష, జరిమానాతోపాటు ప్రయాణ నిషేధం, QR 2 మిలియన్ పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
కేసు వివరాల ప్రకారం,.. బాధితుడు తన మాజీ బిజినెస్ పార్టనర్, స్నేహితుడి వాహనం కొనుగోలుకు QR 162,000 రుణ మొత్తానికి ఫైనాన్సింగ్ కంపెనీకి హామీదారుగా ఉన్నాడు. హామీగా, బాధితుడు తన స్నేహితుడికి ఖాళీ చెక్కును ఇచ్చాడు. అయితే, 10 సంవత్సరాల తరువాత, బాధితుడు తన మాజీ స్నేహితుడు QR 28.5 మిలియన్ల చెక్కు మోసం చేసాడని అరెస్ట్ వారెంట్ జారీ చేయించాడు. అయితే, విచారణ అధికారులు తమ విచారణలో నిజాన్ని తెలుసుకున్నారు. దాంతో కోర్టు ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ మిస్డిమీనర్స్ అండ్ ఫెలోనీస్ 3 సంవత్సరాల జైలు శిక్ష, ప్రయాణ నిషేధం, QR 100,000 ఫైన్ విధించింది. చెక్కులతో లేదా ఏదైనా ఆర్థిక వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలని ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు సూచించింది.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్