మనీలాండరింగ్ కేసులో భారతీయ బిలియనీర్ కు జైలుశిక్ష..!!
- May 03, 2025
యూఏఈ: ఒక క్రిమినల్ గ్రూపుతో సంబంధం ఉన్న ఒక ప్రధాన మనీలాండరింగ్ కేసులో సంబంధం ఉన్న భారతీయ వ్యాపారవేత్త ("అబు సబా"గా ప్రసిద్ధి)కు యూఏఈ కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అలాగే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి నిందితుడికి కోర్టు 500,000 దిర్హామ్ల జరిమానా విధించింది. శిక్ష అనుభవించిన తర్వాత వారిని దేశ నుంచి బహిష్కరించాలని కొర్టు ఆదేశించింది. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ఇతర స్వాధీనం చేసుకున్న వస్తువులతో పాటు 150 మిలియన్ల దిర్హామ్ల అక్రమ లాభాలను జప్తు చేయాలని అదేశించింది.
నకిలీ కంపెనీలు, అనుమానాస్పద బ్యాంకు బదిలీలను ఉపయోగించి నిందితులు అధునాతన మనీలాండరింగ్ ఆపరేషన్ను ఏర్పాటు చేశారని దర్యాప్తులో వెల్లడైంది. దుబాయ్ పోలీసులు గత సంవత్సరం డిసెంబర్లో కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు బదిలీ చేశారు. ఈ కేసును జనవరిలో క్రిమినల్ కోర్టుకు బదిలీ చేశారు. అక్కడ విచారణలు ప్రారంభమై తాజాగా తీర్పుతో ముగిసింది. తదుపరి విచారణ కోసం కేసును అప్పీల్ కోర్టుకు వెళ్లనున్నారు.
దోషులుగా తేలిన వారిలో గైర్హాజరీలో విచారణకు గురైన వ్యక్తులు, మూడు కంపెనీలు సహా కోర్టుకు హాజరైన ఇతరులు ఉన్నారు. ప్రతి కార్పొరేట్ సంస్థకు 50 మిలియన్ డాలర్ల జరిమానా విధించారు. ఆర్థిక రికార్డులు, మొబైల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలతో సహా అన్ని ఆధారాలను జప్తు చేయాలని అధికారులు ఆదేశించారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్