బిగ్ టికెట్ డ్రాలో 25 మిలియన్ దిర్హామ్‌లను గెలుచుకున్న భారతీయుడు..!!

- May 04, 2025 , by Maagulf
బిగ్ టికెట్ డ్రాలో 25 మిలియన్ దిర్హామ్‌లను గెలుచుకున్న భారతీయుడు..!!

యూఏఈ : భారతదేశంలోని త్రివేండ్రం నివాసి అయిన తాజుదీన్ కుంజు..బిగ్ టికెట్ సిరీస్ 274 డ్రాలో దిర్హాం 25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న తర్వాత తాజా మిలియనీర్ అయ్యాడు. తాజుదీన్ తన విజేత టికెట్ (306638)ను ఏప్రిల్ 18న కొనుగోలు చేశాడు. శుక్రవారం అబుదాబిలో జరిగిన లైవ్ డ్రాలో అతను విజయ్ కూడా నిలిచాడు. కాగా,విజేతను నిర్వాహకులు ఫోన్ ద్వారా సంప్రదించలేకపోయారు.
జాక్‌పాట్‌తో పాటు, మరో నలుగురు అదృష్టవంతులు అబ్దుల్ మన్నన్, అక్విలిన్ వెరిటా, మీనా కోషి, సైఫుద్దీన్ కూనారి బిగ్ విన్ కాంటెస్ట్ ద్వారా ఎంపిక అయి లైవ్ డ్రాకు ఆహ్వానించారు. వారిలో ప్రతి ఒక్కరూ నగదు బహుమతులు గెలుచుకున్నారు. బిగ్ టికెట్ ఏప్రిల్ నెలంతా వారానికోసారి ఈ-డ్రాలను నిర్వహించింది.వారి కొనసాగుతున్న ప్రమోషన్లలో భాగంగా ఐదుగురు విజేతలకు ఒక్కొక్కరికి దిర్హామ్స్ 150,000 అందజేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com