దుబాయ్ డ్యూటీ ఫ్రీ డ్రా..భారతీయ ప్రవాసిని వరించిన $1 మిలియన్..!!
- May 08, 2025
దుబాయ్: అజ్మాన్లో నివసిస్తున్న 52 ఏళ్ల భారతీయుడు వేణుగోపాల్ ముల్లాచేరి దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రాలో $1 మిలియన్ గెలుచుకున్నాడు. ఏప్రిల్ 23న టెర్మినల్ 2 అరైవల్ షాపులో కొనుగోలు చేసిన టికెట్ నంబర్ 1163తో సిరీస్ 500 ప్రమోషన్లో అతను 500వ విజేతగా నిలిచాడు. ఒక దశాబ్దానికి పైగా అజ్మాన్లో నివసిస్తున్న ముల్లాచేరి.. అధికారిక దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఫేస్బుక్ పేజీలో ప్రత్యక్ష డ్రాను వీక్షించాడు. తన పేరు ప్రకటించగానే ఎంతో సంతోషం కలిగిందని పేర్కొన్నారు.
ముల్లాచేరి ఇద్దరు పిల్లల తండ్రి. అజ్మాన్లోని ఒక కంపెనీకి IT సపోర్ట్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాడు. 15 సంవత్సరాలకు పైగా ప్రమోషన్లో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా స్పందిస్తూ.. ‘‘దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్లో 500వ విజేతగా నిలిచినందుకు నేను సంతోషంగా ఉన్నాను. ఈ ప్రసిద్ధ ప్రమోషన్లో చాలా కాలంగా పాల్గొంటున్న. చివరకు అనేక మంది విజేతలలో ఒకరిగా ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. దుబాయ్ డ్యూటీ ఫ్రీకి చాలా ధన్యవాదాలు.” అని పేర్కొన్నారు. కేరళకు చెందిన ముల్లాచేరి 1999 నుండి మిలీనియం మిలియనీర్ ప్రమోషన్లో $1 మిలియన్ గెలుచుకున్న 249వ భారతీయుడిగా నిలిచాడు.
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కాన్కోర్స్ Bలో వేడుక డ్రా జరిగింది. దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అధ్యక్షుడు, దుబాయ్ డ్యూటీ ఫ్రీ చైర్మన్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్ హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్