2 విదేశీ బ్యాంకు శాఖలపై Dh18 మిలియన్లకు పైగా జరిమానా..యూఏఈ
- May 29, 2025
యూఏఈ: విదేశీ బ్యాంకుల రెండు శాఖలపై యూఏఈ కేంద్ర బ్యాంకు భారీ జరిమానా విధించింది. ఈ ఆర్థిక ఆంక్షలు ఎమిరేట్స్ మనీలాండరింగ్ నిరోధక చట్టాలకు అనుగుణంగా జారీ చేసినట్టు తెలిపింది. రెండు బ్యాంకులపై Dh18,100,000 జరిమానా విధించారు. మొదటి బ్యాంకుకు Dh10,600,000 జరిమానా విధించగా, రెండవ బ్యాంకుకు Dh7,500,000 జరిమానా విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ తన ప్రకటనలో తెలిపింది. ఆ బ్యాంకులు మనీలాండరింగ్ నిరోధక , ఉగ్రవాదం, చట్టవిరుద్ధ సంస్థలకు ఆర్థిక సహాయం అందించాయని విచారణలో తేలిందని, దాంతో వాటిపై జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు.
ఈ నెల ప్రారంభంలో యాంటీ-మనీలాండరింగ్ (AML) మరియు కౌంటర్-టెర్రరిజం ఫైనాన్సింగ్ నిబంధనల ప్రకారం అథారిటీ ఒక ఎక్స్ఛేంజ్ హౌస్పై Dh200 మిలియన్ల జరిమానా విధించింది. ఒక బ్రాంచ్ మేనేజర్కు కూడా Dh500,000 జరిమానా విధించింది. అలాగే లైసెన్స్ పొందిన ఆర్థిక సంస్థలలో ఎటువంటి సంబంధాలు ఉండకుండా శాశ్వతంగా నిషేధించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









