2 విదేశీ బ్యాంకు శాఖలపై Dh18 మిలియన్లకు పైగా జరిమానా..యూఏఈ
- May 29, 2025
యూఏఈ: విదేశీ బ్యాంకుల రెండు శాఖలపై యూఏఈ కేంద్ర బ్యాంకు భారీ జరిమానా విధించింది. ఈ ఆర్థిక ఆంక్షలు ఎమిరేట్స్ మనీలాండరింగ్ నిరోధక చట్టాలకు అనుగుణంగా జారీ చేసినట్టు తెలిపింది. రెండు బ్యాంకులపై Dh18,100,000 జరిమానా విధించారు. మొదటి బ్యాంకుకు Dh10,600,000 జరిమానా విధించగా, రెండవ బ్యాంకుకు Dh7,500,000 జరిమానా విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ తన ప్రకటనలో తెలిపింది. ఆ బ్యాంకులు మనీలాండరింగ్ నిరోధక , ఉగ్రవాదం, చట్టవిరుద్ధ సంస్థలకు ఆర్థిక సహాయం అందించాయని విచారణలో తేలిందని, దాంతో వాటిపై జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు.
ఈ నెల ప్రారంభంలో యాంటీ-మనీలాండరింగ్ (AML) మరియు కౌంటర్-టెర్రరిజం ఫైనాన్సింగ్ నిబంధనల ప్రకారం అథారిటీ ఒక ఎక్స్ఛేంజ్ హౌస్పై Dh200 మిలియన్ల జరిమానా విధించింది. ఒక బ్రాంచ్ మేనేజర్కు కూడా Dh500,000 జరిమానా విధించింది. అలాగే లైసెన్స్ పొందిన ఆర్థిక సంస్థలలో ఎటువంటి సంబంధాలు ఉండకుండా శాశ్వతంగా నిషేధించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO







