2 విదేశీ బ్యాంకు శాఖలపై Dh18 మిలియన్లకు పైగా జరిమానా..యూఏఈ
- May 29, 2025
యూఏఈ: విదేశీ బ్యాంకుల రెండు శాఖలపై యూఏఈ కేంద్ర బ్యాంకు భారీ జరిమానా విధించింది. ఈ ఆర్థిక ఆంక్షలు ఎమిరేట్స్ మనీలాండరింగ్ నిరోధక చట్టాలకు అనుగుణంగా జారీ చేసినట్టు తెలిపింది. రెండు బ్యాంకులపై Dh18,100,000 జరిమానా విధించారు. మొదటి బ్యాంకుకు Dh10,600,000 జరిమానా విధించగా, రెండవ బ్యాంకుకు Dh7,500,000 జరిమానా విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ తన ప్రకటనలో తెలిపింది. ఆ బ్యాంకులు మనీలాండరింగ్ నిరోధక , ఉగ్రవాదం, చట్టవిరుద్ధ సంస్థలకు ఆర్థిక సహాయం అందించాయని విచారణలో తేలిందని, దాంతో వాటిపై జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు.
ఈ నెల ప్రారంభంలో యాంటీ-మనీలాండరింగ్ (AML) మరియు కౌంటర్-టెర్రరిజం ఫైనాన్సింగ్ నిబంధనల ప్రకారం అథారిటీ ఒక ఎక్స్ఛేంజ్ హౌస్పై Dh200 మిలియన్ల జరిమానా విధించింది. ఒక బ్రాంచ్ మేనేజర్కు కూడా Dh500,000 జరిమానా విధించింది. అలాగే లైసెన్స్ పొందిన ఆర్థిక సంస్థలలో ఎటువంటి సంబంధాలు ఉండకుండా శాశ్వతంగా నిషేధించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం







