వికలాంగులకు కేటాయించిన స్థలంలో పార్కింగ్.. ఒక నెల జైలు శిక్ష..!!
- June 04, 2025
కువైట్: వికలాంగుల కోసం కేటాయించిన స్థలంలో పార్కింగ్ చేసినందుకు ఒక వ్యక్తి దోషిగా తేలిన తర్వాత ట్రాఫిక్ మిస్డిమీనర్ కోర్టు ఒక నెల జైలు శిక్ష విధించింది. అతని డ్రైవింగ్ లైసెన్స్ను సస్పెండ్ చేసింది. ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తుల హక్కులను పరిరక్షించడంలో కఠినంగా వ్యవహారిస్తామని కోర్టు తెలిపింది.
ఏప్రిల్ 22 నుండి కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి రాకముందే ఉల్లంఘన జరిగినందున, వికలాంగుల హక్కులపై 2010 నాటి చట్టం నంబర్ 8 ఆధారంగా కోర్టు తన తీర్పును ప్రకటించింది. ఈ చట్టంలోని ఆర్టికల్ 63 ప్రకారం, వికలాంగుల కోసం కేటాయించిన పార్కింగ్ స్థలాన్ని చట్టవిరుద్ధంగా ఉపయోగించే ఎవరైనా ఒక నెల వరకు జైలు శిక్ష, KD 100 వరకు జరిమానా లేదా రెండింటినీ ఎదుర్కోవలసి ఉంటుంది.
సవరించబడిన ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ 33 బిస్ ప్రకారం.. ఒకటి నుండి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్షతోపాటు KD 600 నుండి KD 1,000 వరకు జరిమానాలు ఉన్నాయి. వికలాంగుల కోసం ఉద్దేశించి సౌకర్యాల దుర్వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని కోర్టు వెల్లడించింది.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్