భారత ప్రధానికి లెటర్ రాసిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- June 15, 2025
జెడ్డా: భారత్ లో జరిగిన విషాదకర విమాన ప్రమాదంపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ సంతాపం తెలిపారు. ఈ మేరకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఒక కేబుల్ పంపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా బాధితుల కుటుంబాలకు క్రౌన్ ప్రిన్స్ తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు.
జూన్ 12( గురువారం) అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి లండన్ కు బయలు దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన 30 సెకన్లకే సమీపంలోని మెడికల్ కాలేజీ భవనంపై కుప్పకూలింది. విమానంలో ఉన్న 241 మందితోపాటు భవనం సమీపంలోని 29 మంది మరణించారు. ఈ ప్రమాదంలో ఒకే ఒక ప్రయాణీకుడు గాయాలతో బయటపడటం గమనార్హం.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్