హజ్ యాత్రికుల విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
- June 16, 2025
ఉత్తర్ ప్రదేశ్: హజ్ యాత్రికులతో లఖ్నవూ ఎయిర్పోర్టుకు చేరుకున్న సౌదీ అరేబియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. 250 మంది హజ్ యాత్రికులతో జెడ్డా నుంచి బయల్దేరిన సౌదీ ఎయిర్లైన్స్ విమానం ఆదివారం ఉదయం లఖ్నవూలోని అమౌసి విమానాశ్రయంలో దిగింది. ఆ తర్వాత.. టాక్సీ మార్గంలో వెళుతుండగా విమానం ఎడమ టైర్ నుంచి నిప్పురవ్వలు, దట్టమైన పొగలు వచ్చినట్లు విమానాశ్రయం అధికారులు సోమవారం వెల్లడించారు. వెంటనే, అప్రమత్తమైన పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కు సమాచారం అందించడంతో సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలు ఆర్పారని తెలిపారు. అనంతరం ప్రయాణికులను విమానం నుంచి సురక్షితంగా దించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఎడమ చక్రం నుంచి మంటలు
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌదీ అరేబియా ఎయిర్లైన్స్కు చెందిన విమానం SV 3112 శనివారం రాత్రి 11:30 గంటలకు సౌదీలోని జెడ్డా విమానాశ్రయం నుంచి 250 మంది హజ్ యాత్రికులతో బయలుదేరింది. ఆదివారం ఉదయం 6:30 గంటలకు లఖ్నవూలోని అమౌసి విమానాశ్రయానికి చేరుకుంది. రన్వేపై దిగిన తర్వాత, విమానం టాక్సీవే పైకి వస్తుండగా దాని ఎడమ చక్రం నుంచి మంటలు, పొగ రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కు సమాచారం అందించాడు.
అత్యవసర చర్యలు–సిబ్బంది శ్రమ ఫలించింది
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక బృందాలు దాదాపు 20 నిమిషాలు శ్రమించి మంటలను ఆర్పారు. అనంతరం ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించినట్లు అధికారులు పేర్కొన్నారు. సాంకేతికలోపం కారణంగా విమానం రన్వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఎడమ చక్రం పనిచేయకపోవడంతో మంటలు వచ్చాయని తెలిపారు.
హజ్ యాత్రికులకు కలిగిన దడ
250 మంది హజ్ యాత్రికులు జెడ్డా నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులంతా ప్రార్థనలు చేసుకుంటూ భయాందోళనలో ఉన్నారు, కానీ సిబ్బంది సత్వర చర్య వల్ల ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటన ద్వారా మరోసారి పైలట్ శాంతస్వభావం, సిబ్బంది అప్రమత్తత, అత్యవసర సేవల సమయోచిత స్పందన వల్ల పెనుప్రమాదం తప్పింది. హజ్ యాత్రికులు సురక్షితంగా బయటపడడం ఆనందదాయకమైన విషయం. అయినప్పటికీ, విమానాల్లో సాంకేతిక లోపాలపై నిరంతర సమీక్ష అవసరం ఉందని విమాన ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!