రేడియేషన్ ప్రమాదం లేదు.. సౌదీ అణు కమిషన్ నిర్ధారణ..!!
- June 21, 2025
రియాద్: ఇజ్రాయెల్-ఇరాన్ వివాదంతోపాటు ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ అరేబియా అణు, రేడియోలాజికల్ రెగ్యులేటరీ కమిషన్ (NRRC) కీలక ప్రకటన చేసింది.దేశాన్ని ప్రభావితం చేసే రేడియేషన్ లీకేజీలు లేవని స్పష్టం చేసింది. ఈ మేరకు తన అధికారిక X ఖాతాలో పోస్ట్ చేసింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య సైనిక తీవ్రత కొనసాగుతున్నప్పటికీ, సౌదీ వ్యాప్తంగా రేడియేషన్ స్థాయిలు సాధారణంగానే ఉన్నాయని, పర్యావరణం సురక్షితంగా ఉందని NRRC తెలిపింది.
అంతకుముందు ఇరాన్ అరక్ పరిశోధన రియాక్టర్పై సైనిక దాడి ఎటువంటి రేడియోలాజికల్ పరిణామాలను కలిగి లేదని, అక్కడ ప్రస్తుతం అణు ఇంధనం లేదని కమిషన్ తెలిపింది. 24/7 పరిణామాలను పర్యవేక్షిస్తున్నట్లు స్పష్టం చేసింది.అత్యవసర కార్యకలాపాల కేంద్రం..అత్యంత అప్రమత్తంగా ఉందన్నారు.రేడియోలాజికల్ ప్రభావాల నుండి ప్రజలను, పర్యావరణాన్ని రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.
తాజా వార్తలు
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- ‘వికసిత్ భారత్’లో ఏపీ పాత్ర కీలకం..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- సేవా కార్యక్రమాల్లో శోభా రెడ్డి–ప్రసాద్ రెడ్డి దంపతుల ఆదర్శ ప్రస్థానం
- ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- రైతులకు సాగునీరు, గృహాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం: సీఎం రేవంత్
- సమైక్య భారత నిర్మాణానికి కృషి చేద్దాం ..దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
- దుబాయ్లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
- వివక్షలు లేని ప్రగతి ప్రస్థానానికి ప్రతి ఒక్కరూ చోదక శక్తులు కావాలి: వెంకయ్య నాయుడు







