ఇరాన్తో అణు ఒప్పందం కోసం చర్చలు కొనసాగుతున్నాయి: ఖతార్
- July 01, 2025
దోహా: ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణతో మిడిలీస్ట్ లో ఉద్రిక్తత ముగిసిన తర్వాత, ఇరాన్ అణు ఫైలుపై ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలలో ఖతర్ తీవ్రంగా ప్రయత్నస్తుందని ఖతార్ ప్రధానమంత్రి సలహాదారు, విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి డాక్టర్ మజేద్ బిన్ మొహమ్మద్ అల్-అన్సారీ తెలిపారు.
అయితే, గాజాలో కాల్పుల విరమణ గురించి ప్రస్తుతం ఎటువంటి చర్చలు జరగడం లేదని ఆయన పేర్కొన్నారు. "ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రయోజనాలతో పాటు, ఖతర్ ఆసక్తి ఇప్పుడు ఇరాన్ -యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్య విస్తృత అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవడం వైపు మళ్ళించాము." అని అన్నారు. అణు ఒప్పందం విషయంలో వివిధ పార్టీలతో ఖతార్ ప్రతిరోజూ సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు.
ప్రస్తుత ఇజ్రాయెల్ సైన్యం కారణంగా గాజాలో జరుగుతున్న మానవతా విపత్తును అల్-అన్సారీ ఖండించారు. "ఈ సంక్షోభం దాదాపు రెండు సంవత్సరాలుగా కొనసాగుతుంది. దీనికి ఒక పరిష్కారాన్ని చూపాల్సి బాధ్యత అంతర్జాతీయ సమాజంపై ఉంది." అని పేర్కొన్నారు. గాజాపై చర్చలను తిరిగి ప్రారంభించడం కోసం అమెరికాను ఒప్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్