Dh9,900 మోసం చేసిన స్కామర్లకు జైలు శిక్ష, జరిమానా..!!
- July 02, 2025
దుబాయ్: పోలీసు అధికారులమని, అరబ్ జాతీయుడిని 9,900 దిర్హామ్లు మోసం చేసిన కేసులో దోషులుగా తేలిన ఐదుగురు ఆసియా వ్యక్తులకు ఒక నెల జైలు శిక్ష విధించారు. శిక్ష పపూర్తయ్యాక దేశం నుండి బహిష్కరించాలని కోరారు. అధికారులుగా నటిస్తూ, యూఏఈ సెంట్రల్ బ్యాంక్లో తన రికార్డులను అప్డేట్ చేస్తున్నానని చెప్పి బాధితుడు తన బ్యాంక్ ఖాతా వివరాలను వెల్లడించాలని ఒత్తిడి చేసినందుకు దుబాయ్ మిస్డిమీనర్స్ కోర్టు నిందితులకు మొత్తం దిర్హామ్లు 9,900 జరిమానా విధించింది.
మార్చి నెలలో బాధితుడికి పోలీసు అధికారిగా చెప్పుకుంటూ ముఠా సభ్యులలో ఒకరు ఫోన్ కాల్ చేసినప్పుడు ఈ సంఘటన జరిగిందని కోర్టు పత్రాలు వెల్లడించాయి. కాల్ చేసిన వ్యక్తి తన బ్యాంక్ సమాచారాన్ని వెంటనే అప్డేట్ చేయకపోతే, తన ఖాతా స్తంభిస్తుందని బాధితుడిని హెచ్చరించారు. ఆ వ్యక్తి అప్రమత్తమయ్యేలోపే తన ఖాతా నుండి Dh9,900 డ్రా అయింది.
విచారణలో భాగంగా దుబాయ్ పోలీసులు డీరాలోని ఒక అపార్ట్మెంట్కు వెళ్లారు. అక్కడ అనుమానితులు పనిచేస్తున్నారు. ఫ్లాట్ నుండి అనేక స్మార్ట్ఫోన్లతోపాటు ఇతర కొన్ని విలువైన వస్తువులను సీజ్ చేశారు. ఫోరెన్సిక్ దర్యాప్తులో ఫిర్యాదుదారుని సంప్రదించడానికి ఒక ఫోన్ ఉపయోగించినట్లు తేలింది.
విచారణ సమయంలో, అపార్ట్మెంట్ను అద్దెకు తీసుకుని దేశం విడిచి వెళ్ళిన వ్యక్తి సూచనల మేరకు తాము పనిచేస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. అతను వారికి రిమోట్గా సూచనలు అందించాడపొ, బాధితుల బ్యాంకింగ్ డేటాను ఉపయోగించి నిధులను ఉపసంహరించుకున్నారని తెలిపారు. వారికి Dh1,800, Dh2,000 మధ్య నెలవారీ జీతం చెల్లిస్తున్నారు. ఐదుగురు మోసం, గుర్తింపును తప్పుగా చూపించినందుకు కోర్టు దోషులుగా నిర్ధారించింది. వారి జైలు శిక్ష అనుభవించిన తర్వాత, వారిని బహిష్కరిస్తారు. బ్యాంకు అధికారులను అనుకరిస్తూ కాల్ చేసేవారితో జరిగే ఫోన్ స్కామ్ల బారిన పడవద్దని గుర్తు చేయడానికి దుబాయ్ పోలీసులు ఈ కేసును ఉదహరించారు.
“దుబాయ్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ ద్వారా బ్యాంకింగ్ సమాచారాన్ని అభ్యర్థించరు. అలాంటి ఏదైనా కాల్ అనుమానాస్పదంగా పరిగణించాలి,” అని పోలీసు ప్రతినిధి ఒకరు తెలిపారు. అలాంటి కాల్ వస్తే, దుబాయ్ పోలీస్ యాప్ ద్వారా లేదా 901కి కాల్ చేయడం ద్వారా వెంటనే నివేదించాలని కోరారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!