రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి BD9,400 పరిహారం: కోర్టు
- July 05, 2025
మనామా: బహ్రెయిన్ రోడ్డు దాటుతుండగా ఓ వాహనం ఢీకొన్న తర్వాత అతనికి BD9,400 పరిహారం పెంచుతూ కోర్టు తీర్పునిచ్చింది. ఆ వ్యక్తి రిఫాలో రోడ్డుపైకి అడుగు పెడుతుండగా, డ్రైవర్ అతన్ని గుర్తించలేక ఢీకొన్నాడు. ఇందులో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వైద్యులు అతని శాశ్వత వైకల్యాన్ని 15 శాతంగా లెక్కగట్టారు.
అప్పీల్స్ కోర్టు గతంలో BD8,900 మొత్తాన్ని బాధితుడికి చెల్లించాలని ఆదేశించింది.దీనిపై డ్రైవర్ కారును కవర్ చేసిన బీమా సంస్థ మొదటి తీర్పును సవాలు చేసింది. అయితే, ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదికను పరిశీలించిన కోర్టు..నుదిటిలో విరిగిన ఎముక, తలపై గాయం, ఛాతీపై గాయాలు, పగిలిన పక్కటెముకలు, ఎడమ మోకాలికి దెబ్బ, పై చేయి విరిగిపోవడం వల్ల అతనికి కదలిక తగ్గిందని దాంతో అతడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు కోర్టు నిర్ధారించింది. దిగువ కోర్టు శారీరక హాని, మానసిక క్షోభకు BD8,500, అతని చిన్న కొడుకుకు కలిగిన బాధకు BD400 చెల్లించాలని ఆదేశించింది. వైద్య ప్యానెల్కు BD90 , చట్టపరమైన రుసుములలో BD100 అదనంగా చెల్లించాలని బీమా సంస్థను ఆదేశించింది.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!