విశాఖపట్నం, విజయవాడ మెట్రోకు టెండర్ల ఆహ్వానం
- July 24, 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెట్రో రైలు ప్రాజెక్టుల రూపంలో అభివృద్ధి దిశగా మరో అడుగు పడింది.విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది.రేపటి నుండి ఈ రెండు ప్రాజెక్టుల కోసం టెండర్లు ఆహ్వానించనున్నారు. దీని ద్వారా రాష్ట్రంలో ఆధునిక రవాణా మౌలిక వసతుల అభివృద్ధికి బలమైన పునాది పడనుంది.
విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు కోసం రూ.11,498 కోట్లు, విజయవాడ మెట్రో ప్రాజెక్టు కోసం రూ.10,118 కోట్లు ఖర్చు చేయనున్నారు. మొత్తం రూ.21,616 కోట్ల అంచనాతో ఈ రెండు నగరాల్లో మెట్రో రైలు మార్గాలు ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రాజెక్టులు ప్రజలకు వేగవంతమైన, నిష్కలుషమైన, ఆధునిక రవాణా సౌకర్యాలను అందించనున్నాయి.
కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యంలో మెట్రో నిర్మాణం
ఈ మెట్రో ప్రాజెక్టులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో 50:50 నిష్పత్తిలో నిర్మించనున్నారు. మెట్రో రైలు ద్వారా ట్రాఫిక్ సమస్యలు తగ్గడమే కాకుండా, నగర అభివృద్ధికి బలమైన మద్దతు లభిస్తుంది. అలాగే, ప్రజలకు సురక్షితమైన రవాణా మార్గం లభించడం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. ఇది రాష్ట్ర ప్రజలకు ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయనుంది.
తాజా వార్తలు
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం