బహ్రెయిన్లో మేకప్ డ్రగ్ పార్శిల్ కేసు.. నిందితుడికి 15ఏళ్ల జైలుశిక్ష..!!
- August 13, 2025
మనామా: బహ్రెయిన్ లో భారీ డ్రగ్ నెట్ వర్క్ బయటపడింది. ఒక ప్రసిద్ధ కంపెనీలో డెలివరీ ఏజెంట్గా పనిచేస్తున్న ఒక ఆసియా వ్యక్తి అమెరికా నుండి మేకప్ షిప్మెంట్లో దాచిపెట్టిన గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. ఈ కేసును విచారించిన కోర్టు 15 సంవత్సరాల జైలు శిక్షతోపాటు, 5,000 దినార్ల జరిమానా విధించింది. జైలు శిక్ష పూర్తియిన తర్వాత అతడిని దేశం నుండి బహిష్కరించాలని ఆదేశించింది.
పోస్టల్ షిప్మెంట్ల ద్వారా డ్రగ్స్ ను అక్రమంగా రవాణా చేస్తున్న ఇంటర్నేషనల్ నెట్వర్క్లో అతను భాగమని దర్యాప్తులో తేలింది. ఏప్రిల్ 5న బహ్రెయిన్ ఎయిర్ పోర్టులో పార్శిల్ను సీజ్ చేశారు. అందులో మేకప్ వస్తువల మాటున దాచిన 1.016 కిలోల బరువున్న మూడు బ్యాగుల గంజాయిని గుర్తించారు. ఈ పార్శిల్ ను తీసుకునేందుకు వచ్చిన క్రమంలో నిందితుడిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్