తిరుమలలో వసతి పేరిట 30 నకిలీ వెబ్ సైట్లు
- August 13, 2025
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి ఆన్లైన్లో టికెట్లు అందిస్తున్నట్టు చూపించి, సైబర్ నేరగాళ్లు భక్తులను మోసం చేస్తున్నారు. గెస్ట్హౌస్లు, వసతి బుకింగ్లు పేరుతో నకిలీ వెబ్సైట్లు ఏర్పాటుచేసి డబ్బులు వసూలు చేస్తున్నారు.ఈ మోసాలకు అడ్డుకట్ట వేయాలని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఇప్పటివరకు 28 నకిలీ వెబ్సైట్లు తొలగించారు. మిగతావి కూడా తొలగించేందుకు ప్రక్రియ కొనసాగుతోంది.సప్తగిరి, నందకం, పద్మావతి గెస్ట్హౌస్ వంటి పేర్లతో నకిలీ సైట్లు రూపొందించి భక్తులను విశ్వసింపజేస్తున్నారు. కానీ, ఈ సైట్లు టీటీడీకి ఎలాంటి సంబంధం ఉండదని పోలీసులు స్పష్టం చేశారు.భక్తులు http://www.tirumala.org అనే టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే టికెట్లు, వసతి, సేవలు పొందాలని స్పష్టంగా సూచిస్తున్నారు. దీనికంటే ఇతర ఏ వెబ్సైట్నూ నమ్మొద్దని హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం
- ఏపీలో ఎయిర్పోర్ట్ అభివృద్ధి పై కేంద్రం శుభవార్త
- IPL మెగా ఆక్షన్: 2025లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల పూర్తి జాబితా..
- వరల్డ్ కప్ విజేతలకు విశాఖలో స్వాగతం..
- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్లు వీరే!
- జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి
- మెడికవర్ హాస్పిటల్స్ లో 'న్యూరో స్టెంటింగ్' ద్వారా 69 ఏళ్ళ మహిళ కొత్త జీవితం
- చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!







