ప్రపంచ ఛాంపియన్షిప్లో అదరగొడుతున్న పీవీ సింధు
- August 29, 2025
పారిస్: ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అదరగొడుతోంది.గత కొన్నాళ్లుగా ఫామ్ లేమీతో సతమతమైన సింధు ప్రతిష్ఠాత్మక టోర్నీలో క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సింధు ప్రపంచ రెండో ర్యాంకర్, చైనాకు చెందిన షట్లర్ వాంగ్ జి యిపై విజయం సాధించింది.
48 నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో సింధు వరుస సెట్లలో 21-19, 21-15 తేడాతో వాంగ్ పై గెలుపొందింది. ఈ క్రమంలో వాంగ్ పై ముఖాముఖీ పోరులో తన రికార్డును 3-2తో మెరుగుపరచుకుంది. ఇక క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో సింధు ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమవర్ధనితో తలపడనుంది.
ఈ మ్యాచ్లో సింధు విజయం సాధిస్తే.. రికార్డు స్థాయిలో ప్రపంచ ఛాంపియన్ షిప్లో ఆరో పతకం సింధు సొంతమవుతుంది. ఈ టోర్నీలో సింధు.. 2013, 2014లో క్యాంస్య పతకాలు సాధించగా, 2017, 2018 రజత పతకాలు అందుకుంది. ఇక 2019లో స్వర్ణ పతకం సాధించింది.
గతంలో సింధు, కుసుమవర్ధనిలు ఒకే ఒక సారి తలపడ్డారు.ఉబెర్ కప్ గ్రూప్ స్టేజ్లో జరిగిన నాటి మ్యాచ్లో 21-15, 21-17 తేడాతో సింధు విజయం సాధించింది.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









