ప్రపంచ ఛాంపియన్షిప్లో అదరగొడుతున్న పీవీ సింధు
- August 29, 2025
పారిస్: ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అదరగొడుతోంది.గత కొన్నాళ్లుగా ఫామ్ లేమీతో సతమతమైన సింధు ప్రతిష్ఠాత్మక టోర్నీలో క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సింధు ప్రపంచ రెండో ర్యాంకర్, చైనాకు చెందిన షట్లర్ వాంగ్ జి యిపై విజయం సాధించింది.
48 నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో సింధు వరుస సెట్లలో 21-19, 21-15 తేడాతో వాంగ్ పై గెలుపొందింది. ఈ క్రమంలో వాంగ్ పై ముఖాముఖీ పోరులో తన రికార్డును 3-2తో మెరుగుపరచుకుంది. ఇక క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో సింధు ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమవర్ధనితో తలపడనుంది.
ఈ మ్యాచ్లో సింధు విజయం సాధిస్తే.. రికార్డు స్థాయిలో ప్రపంచ ఛాంపియన్ షిప్లో ఆరో పతకం సింధు సొంతమవుతుంది. ఈ టోర్నీలో సింధు.. 2013, 2014లో క్యాంస్య పతకాలు సాధించగా, 2017, 2018 రజత పతకాలు అందుకుంది. ఇక 2019లో స్వర్ణ పతకం సాధించింది.
గతంలో సింధు, కుసుమవర్ధనిలు ఒకే ఒక సారి తలపడ్డారు.ఉబెర్ కప్ గ్రూప్ స్టేజ్లో జరిగిన నాటి మ్యాచ్లో 21-15, 21-17 తేడాతో సింధు విజయం సాధించింది.
తాజా వార్తలు
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయం పై సీఎం రేవంత్ ని అభినందించిన ఎంపీలు
- మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులకు అవకాశం
- 10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్
- ఉర్దూ అకాడమీ వారోత్సవాలు: మంత్రి ఫరూక్
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్







