ప్రపంచ ఛాంపియన్షిప్లో అదరగొడుతున్న పీవీ సింధు
- August 29, 2025
పారిస్: ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అదరగొడుతోంది.గత కొన్నాళ్లుగా ఫామ్ లేమీతో సతమతమైన సింధు ప్రతిష్ఠాత్మక టోర్నీలో క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సింధు ప్రపంచ రెండో ర్యాంకర్, చైనాకు చెందిన షట్లర్ వాంగ్ జి యిపై విజయం సాధించింది.
48 నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో సింధు వరుస సెట్లలో 21-19, 21-15 తేడాతో వాంగ్ పై గెలుపొందింది. ఈ క్రమంలో వాంగ్ పై ముఖాముఖీ పోరులో తన రికార్డును 3-2తో మెరుగుపరచుకుంది. ఇక క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో సింధు ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమవర్ధనితో తలపడనుంది.
ఈ మ్యాచ్లో సింధు విజయం సాధిస్తే.. రికార్డు స్థాయిలో ప్రపంచ ఛాంపియన్ షిప్లో ఆరో పతకం సింధు సొంతమవుతుంది. ఈ టోర్నీలో సింధు.. 2013, 2014లో క్యాంస్య పతకాలు సాధించగా, 2017, 2018 రజత పతకాలు అందుకుంది. ఇక 2019లో స్వర్ణ పతకం సాధించింది.
గతంలో సింధు, కుసుమవర్ధనిలు ఒకే ఒక సారి తలపడ్డారు.ఉబెర్ కప్ గ్రూప్ స్టేజ్లో జరిగిన నాటి మ్యాచ్లో 21-15, 21-17 తేడాతో సింధు విజయం సాధించింది.
తాజా వార్తలు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!
- రేపు TTPF 6వ వార్షికోత్సవం
- ఆసియా లాక్రోస్ గేమ్స్లో భారత్కు డబుల్ టైటిల్









