పెట్రోల్ స్టేషన్లలో యూఏఈ లాటరీ టక్కెట్లు..!!

- September 01, 2025 , by Maagulf
పెట్రోల్ స్టేషన్లలో యూఏఈ లాటరీ టక్కెట్లు..!!

యూఏఈ: గత 10 నెలల్లో యూఏఈ లాటరీ మెరుగైన పనితీరును ప్రదర్శించింది.  ఆన్‌లైన్‌లో ఈ గేమ్ కు 600,000 మందికిపైగా తమ పేర్లను నమోదుచేసుకున్నారు. దుబాయ్ లో మూడు ప్రదేశాలలోని ADNOC పెట్రోల్ స్టేషన్లలో కంపెనీ తన టిక్కెట్ల అమ్మకాన్ని ప్రారంభించిందని ది గేమ్‌లోని లాటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ బిషప్ వూస్లీ అన్నారు. ఈ గేమ్‌తో  వేలాది మంది ధనవంతులుగా మరారాని తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 247,119 మందికి పైగా విజేతలు అయ్యారని పేర్కొన్నారు.  

కాగా, గత నెలలో యూఏఈ లాటరీ నాలుగు కొత్త స్క్రాచ్ కార్డులను ప్రారంభించింది. దీని వలన నివాసితులకు Dh5 నుండి Dh50 వరకు టిక్కెట్లతో Dh 1 మిలియన్ వరకు గెలుచుకునే అవకాశం లభించింది.  యూఏఈ లాటరీ రిటైల్ ఎక్స్‌ప్రెస్‌లో పాల్గొనేందుకు కచ్చితంగా 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలని, అలాంటి వారినే అనుమతిస్తామని ఒక ఉన్నత అధికారి చెప్పారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com