ఖతార్లో హెల్తీ అలవాట్లపై MOPH అప్పీల్..!!
- September 02, 2025
దోహా: ఖతార్ లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పిల్లల పెరుగుదలకు అవసరమైన ఆరోగ్యకరమైన అలవాట్ల ప్రాముఖ్యతపై ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ఒక రిమైండర్ను జారీ చేసింది. పోషకాలతో కూడిన సమతుల్య అల్పాహారంతో రోజును ప్రారంభించడం ఆరోగ్యకరమైన ఆహారంలో కీలకమని తన సోషల్ మీడియా పోస్టులో చెప్పింది.
పిల్లలలో ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించడానికి హెల్త్ మినిస్ట్రీ అనేక విషయాలను తెలిపింది. లంచ్ బాక్సులలో పోషకాలు, సమతుల్య ఆహారం ఉండేలా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు మరియు పెరుగు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ను అందించాలి. ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తిని పెంచడానికి వారానికి కనీసం రెండుసార్లు వివిధ రకాల చేపలను పిల్లలకు అందివ్వాలి.
పిల్లలను ఫాటేయర్, క్రోసెంట్ లేదా మఫిన్కు బదులుగా ఒక గిన్నె ఓట్ మీల్, తృణధాన్యాలు లేదా తృణధాన్యాల టోస్ట్తో రోజును ప్రారంభించేలా ప్రోత్సహించాలి. ఎముకలు మరియు దంతాలను బలోపేతం చేయడానికి ప్రతిరోజూ తక్కువ ఫ్యాట్ ఉన్న పాలు మరియు పాల ఉత్పత్తులను అందివ్వాలి. తల్లిదండ్రులుగా ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం ద్వారా పిల్లల్లో వాటిపట్ల ఆసక్తి పెరిగేలా చర్యలు తీసుకోవాలి.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్