బ్యాంక్ కస్టమర్లే వారి టార్గెట్..!!

- September 05, 2025 , by Maagulf
బ్యాంక్ కస్టమర్లే వారి టార్గెట్..!!

కువైట్: బ్యాంకు కస్టమర్లు లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను కువైట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండస్ట్రియల్ షువైఖ్ జిల్లాలో వీరిపై అనేక కేసులు నమోదైనట్టు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసులు దర్యాప్తు చేశారని తెలిపారు.  బాధితులను ట్రాక్ చేసేందుకు నిందితులు ఫేక్ లైసెన్స్ ప్లేట్లతో కూడిన వాహనాలను వీరు ఉపయోగించుకున్నారని తెలిపారు. బ్యాంకుల వద్ద దొంగల కదలికలపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే అల్-దజీజ్‌లోని ఒక బ్యాంకు సమీపంలో వాహనాల్లో అనుమానస్పదంగా ఉన్న ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com