కేంద్ర ప్రభుత్వంలో మరో కొత్త శాఖ చేరింది..

- July 21, 2016 , by Maagulf
కేంద్ర ప్రభుత్వంలో మరో కొత్త శాఖ చేరింది..

కేంద్ర ప్రభుత్వంలో మరో కొత్త శాఖ చేరింది. కమ్యూనికేషన్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వ శాఖను రెండుగా విభజిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కమ్యూనికేషన్‌ మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖలుగా పనిచేయనున్నాయి. ఇంటర్నెట్‌, సంబంధిత సేవలు, ఆధార్‌పై ప్రత్యేకంగా పనిచేసేందుకు ఈ కొత్త శాఖను ఏర్పాటుచేసినట్లు కేంద్రం తెలిపింది.
ఈ మార్పులను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదించినట్లు కేబినెట్‌ సెక్రటేరియట్‌ తెలిపింది. కొత్తగా ఏర్పాటైన ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ.. యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(యూఐడీఏఐ), ఆధార్‌ నంబర్లు తదితర విషయాలపై పనిచేయనుంది. గతేడాది సెప్టెంబర్‌లో యూఐడీఏఐను నీతీఆయోగ్‌ కింది నుంచి కమ్యూనికేషన్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వ శాఖ పరిపాలన కిందికి తెచ్చిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com