కాంతార సినిమా పై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్
- October 04, 2025
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కాంతార ఛాప్టర్ 1. బ్లాక్ బస్టర్ కాంతార కు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా అక్టోబర్ 2న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయింది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మాణంలో రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. అలాగే.. జయరాం, గుల్షన్ దేవయ్య లాంటి యాక్టర్స్ కీలక పాత్రల్లో నటించారు. ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాకు విడుదల తరువాత కూడా అదే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబడుస్తోంది కాంతార.
ఇక మొదటిరోజు ఏకంగా రూ.89 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా కేవలం రెండురోజుల్లోనే రూ.150 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్టు సమాచారం. ఇక ఈ సినిమాకు కేవలం ప్రేక్షకుల నుంచి మాత్రమే కాకుండా స్టార్స్ నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా గురించి ఎన్టీఆర్, ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా లాంటి స్టార్స్ సోషల్ మీడియా వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ లిస్టులో మరో స్టార్ చేరిపోయాడు. ఆ స్టార్ మరెవరో కాదు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.
రీసెంట్ గా సినిమా చూసిన ఆయన సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. “కాంతార సినిమా ఒక అద్భుతం. దేశంలోని ప్రతీ నిర్మాత రిషబ్ శెట్టి, అతడి టీమ్ని చూసి సిగ్గుపడాలి. సినిమాలోని కంటెంట్, వారి కష్టమే ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ అయ్యేలా చేసింది. సినిమా విషయంలో ఎక్కడ కూడా రాజీపడకుండా సహాయ సహకారాలు అందించిన హోంబలే ఫిల్మ్స్ని తప్పకుండా అభినందించి తీరాలి. రిషబ్ శెట్టి గొప్ప యాక్టరా.. గొప్ప డైరెక్టరా? అనేది తేల్చుకోలేకపోతున్నాను”అంటూ ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. దీంతో ఆయన చేసిన ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది.
KANTAAAARRRAAA is FANTAAAASTICCCC .. All FILM MAKERS in INDIA should feel ASHAMED after seeing the UNIMAGINABLE EFFORT @Shetty_Rishab and his team put in the BGM, SOUND DESIGN, CINEMATOGRAPHY , PRODUCTION DESIGN and VFX ..Forgetting the CONTENT which is a BONUS , their EFFORT…
— Ram Gopal Varma (@RGVzoomin) October 3, 2025
తాజా వార్తలు
- మూడు ప్రాంతాలు.. మూడు సభలు..కూటమి బిగ్ ప్లాన్..!
- మలేషియాలో ఘనంగా దసరా, బతుకమ్మ, దీపావళి వేడుకలు
- హమాస్ ప్రకటనను స్వాగతించిన ఖతార్..!!
- సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తొలి సాంస్కృతిక సంస్థ ప్రారంభం..!!
- ప్రపంచ వేదికపై మొదటి ఎమిరాటీగా మరియం రికార్డు..!!
- మానవ అక్రమ రవాణా, వీసా స్కామ్ గుట్టురట్టు..!!
- ఒమన్ లో 50శాతం పెరిగిన సైబర్ నేరాలు..!!
- ఇజ్రాయెల్ నిర్బంధంపై ఒక్కటైన బహ్రెయిన్, కువైట్..!!
- టీమ్ఇండియా వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్..
- కరూర్ ఘటనపై విజయ్ పై హైకోర్టు ఆగ్రహం