ఉచిత బస్సుల పై వెంకయ్య నాయుడు ఫైర్
- October 07, 2025
హైదరాబాద్: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉచిత పథకాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేస్తున్న ఏపీ, తెలంగాణ,కర్ణాటక ప్రభుత్వాలను ఆయన ప్రశ్నించారు. ఉచిత పథకాల కోసం ప్రభుత్వాలు భారీగా అప్పులు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం పేరుతో అప్పుల్లో కూరుకుపోతే రాష్ట్ర అభివృద్ధి దెబ్బతింటుందని హెచ్చరించారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వాలకు సూచించారు. ఉచిత పథకాల ద్వారా ప్రజలకు తాత్కాలిక లాభం కలిగించినా, దీర్ఘకాలంలో అది ఆర్థిక భారం అవుతుందని అన్నారు. “చేపలు ఇచ్చే బదులు చేపలు పట్టడం నేర్పించాలి” అంటూ వెంకయ్య నాయుడు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
అలాగే రాజకీయ నాయకుల ప్రవర్తనపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలలో బూతులు తిట్టడం సిగ్గుచేటు అని, ఇలాంటి వ్యవహారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్టీలు మారే ప్రజా ప్రతినిధులు ముందుగా రాజీనామా చేయాలన్నారు. క్రిమినల్ కేసుల్లో ఉన్న నాయకులపై విచారణ త్వరగా పూర్తయ్యేలా చూడాలని కూడా కోరారు. రాజకీయ వారసత్వాలకు తాను వ్యతిరేకమని, అందుకే తన కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకురాలేదని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఘోర ప్రమాదం.. బస్సులోని 18 మంది ప్రయాణికులు మృతి..
- వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్ ‘యూజర్ నేమ్’ ఫీచర్..
- ఉచిత బస్సుల పై వెంకయ్య నాయుడు ఫైర్
- మంగళగిరి ఎయిమ్స్ లో త్వరలో ట్రామా సెంటర్: ఎంపీ బాలశౌరి
- అమెరికాలో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా గాంధీజయంతి వేడుకలు
- డా.బంగారి రజనీ ప్రియదర్శినికి టైమ్స్ ఆఫ్ ఇండియా హెల్త్ కేర్ ఐకాన్ అవార్డ్
- ఎస్ఎస్ఆర్ హోటల్స్ కు స్వచ్ఛ ఆంధ్రా అవార్డు..!!
- జ్లీబ్ సమస్యకు వర్కర్స్ సిటీస్ తో చెక్..!!
- BD7,000 విలువైన గోల్డ్ జివెల్లరీ చోరీ..మహిళ అరెస్టు..!!
- కస్టమ్స్ యాప్ ద్వారా కార్లు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ వేలం..!!