'వేదాళం' స్టోరీపై పవన్ ఫోకస్..
- July 23, 2016
సర్దార్ గబ్బర్సింగ్ మూవీ వచ్చి మూడునెలలు గడిచిపోయింది. ఇప్పటివరకు పవన్కల్యాణ్ కొత్త సినిమా మొదలుకాలేదు. సూర్య కాంబినేషన్ ఓ చిత్రానికి పూజా కార్యక్రమాలు ప్రారంభం కాగానే వెనక్కివెళ్లిపోయింది. ఈలోగా డాలీతో మరో ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఆగష్టుతో సెట్స్ పైకి వెళ్తుందని నిర్మాత శరత్ చెప్పుకొచ్చాడు. లేటెస్ట్గా కోలీవుడ్ డైరెక్టర్తో పవన్ కొత్త మూవీకి ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
అజిత్ హీరోగా 'వేదాళం' స్టోరీపై పవన్ బాగా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ప్రొడ్యూసర్ ఏఎం రత్నం, పవన్తో సంప్రదింపులు చేస్తున్నాడట. ఈ రీమేక్ను తాను నిర్మిస్తానని ఆయన ముందుకొచ్చినట్టు సమాచారం. మరోవైపు పవన్ ఇమేజ్కు తగ్గట్టుగా స్టోరీలో కాస్త మార్పులు చేర్పులు జరుగుతున్నాయని ఇన్సైడ్ సమాచారం. అంతా ఓకే అయితే.. రీమేక్కు నేసన్ డైరెక్ట్ చేసే ఛాన్స్ వుందని చెబుతున్నారు. ఆ మధ్య విజయ్-మోహన్లాల్ కాంబోలో వచ్చిన 'జిల్లా'కి డైరెక్టర్ ఈయనే! మొత్తానికి ఓవైపు డాలీ, మరోవైపు నేసన్, ఇంకోవైపు త్రివిక్రమ్లతో పవన్ బిజీ అన్నమాట.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









