తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం

- December 29, 2025 , by Maagulf
తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం

తిరుమల: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారి ఆలయానికి విచ్చేశారు.ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు.కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మీ,మంత్రి అచ్చెన్నాయుడు, TV5 ఎండీ రవీంద్రనాథ్ పాల్గొన్నారు.

సీఎంను శాలువాతో సత్కరించిన టీటీడీ చైర్మన్, శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఆలయ పరిపాలన, భక్తుల సౌకర్యాల పై క్షణకాలం చర్చించారు.

రేవంత్ రెడ్డి రేపు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకోనున్నారు.ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.భక్తుల భద్రత, దర్శన సౌలభ్యం కోసం అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com