ఎక్స్లో అశ్లీల కంటెంట్పై కఠిన చర్యలు
- January 04, 2026
ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఎక్స్ (X)లో(X Platform) అశ్లీల, చట్టవిరుద్ధ కంటెంట్ వేగంగా పెరుగుతుండటంపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంస్థ కీలక ప్రకటన చేసింది. ప్లాట్ఫామ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమ కంటెంట్ పోస్ట్ చేస్తే, ఆ పోస్టులను పూర్తిగా తొలగించడమే కాకుండా సంబంధిత ఖాతాలను శాశ్వతంగా సస్పెండ్ చేస్తామని స్పష్టం చేసింది.
స్థానిక ప్రభుత్వాలు, చట్ట అమలు సంస్థలతో సమన్వయంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎక్స్ వెల్లడించింది. ఈ విషయాన్ని సంస్థకు చెందిన గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ అధికారిక అకౌంట్ ద్వారా ప్రకటించింది.
అశ్లీల కంటెంట్ను గుర్తించి తొలగించేందుకు ఏఐ ఆధారిత గ్రోక్ టెక్నాలజీని వినియోగిస్తామని గతంలోనే ఎలాన్ మస్క్ హెచ్చరించారు. అదే దిశగా ఇప్పుడు గ్లోబల్ గవర్నమెంట్(X Platform) అఫైర్స్ విభాగం కూడా స్పందిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే అకౌంట్లపై కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. ఎక్స్ కంటెంట్ పాలసీలకు సంబంధించిన లింక్ను కూడా షేర్ చేసింది.
భారత ప్రభుత్వం కూడా ఎక్స్లో పెరుగుతున్న అశ్లీల కంటెంట్ను గమనించింది. ముఖ్యంగా గ్రోక్ ఏఐ ద్వారా మహిళల అసభ్యకర చిత్రాలను రూపొందించడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జనవరి 2న ఎక్స్కు నోటీసులు జారీ చేసి, ఆ కంటెంట్ను వెంటనే తొలగించాలని ఆదేశించింది. అలాగే దీనిపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్: బస్సు ప్రైవేట్ ఆపరేటర్లకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హెచ్చరిక
- సందర్శకులను అబ్బురపరుస్తున్న మస్కట్ నైట్స్..!!
- కువైట్ లో 45 మంది డ్రైవర్లకు జైలు శిక్ష..!!
- బహ్రెయిన్ లో పబ్లిక్ ట్రాన్స్ పోర్టుకు ఫుల్ డిమాండ్..!!
- ఇండోనేషియాలో జెట్ స్కీ ప్రమాదంలో సౌదీ సిటిజన్ మృతి..!!
- మెట్రాష్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు..!!
- జుమేరా బీచ్1 విస్తరణ 95% పూర్తయింది.. షేక్ హమ్దాన్
- ఒమన్లో సగటు ద్రవ్యోల్బణం 0.94 శాతం..!!
- సౌదీ అరేబియా బ్యాంకింగ్ రంగానికి భారీ మద్దతు..!!
- బహ్రెయిన్లో జనవరి 22 నుండి ఆటమ్ ఫెయిర్ 2026..!!







