మిలిటెంట్లు పోలీసుల తుపాకులతో పరారీ

- September 08, 2016 , by Maagulf
మిలిటెంట్లు పోలీసుల తుపాకులతో పరారీ

కశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీకి చెందిన ఓ నాయకుడి ఇంటిపై మిలిటెంట్లు దాడి చేశారు. భద్రతా సిబ్బందిని కొట్టి.. వారి తుపాకులతో పరారయ్యారు. కుల్గాం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..నేషనల్‌ కాన్ఫరెన్స్‌ బ్లాక్‌ ప్రెసిడెంట్‌ అబ్దుల్‌ రషీద్‌ ఖాండే ఇంటి ఆవరణలోకి కొందరు మిలిటెంట్లు చొరబడ్డారు. రషీద్‌ ఇంటి వద్ద కాపలా కాస్తున్న భద్రతాసిబ్బందిపై దాడి చేసి, నాలుగు సర్వీసు తుపాకులను ఎత్తుకెళ్లారు. దీంతో రషీద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.కశ్మీర్‌ వ్యాప్తంగా భద్రతాసిబ్బందిని అప్రమత్తం చేసి, పరారైన మిలిటెంట్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com