బక్రీద్‌, గణేశ్ నిమజ్జనం ఒకే రోజు

- September 12, 2016 , by Maagulf
బక్రీద్‌, గణేశ్ నిమజ్జనం ఒకే రోజు

బక్రీద్‌, వినాయక నిమజ్జనం కోసం విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలీస్‌ జీహెచ్ఎంసీ యంత్రాంగం సమన్వయంతో వ్యవహరిస్తున్నారు. ఏర్పాట్లపై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్‌ జనార్థన్‌రెడ్డి ఉమ్మడిగా సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి 24గంటలూ ఉద్యోగులను అందుబాటులో ఉంచనున్నారు. రెవెన్యూ, వాటర్‌ వర్క్స్‌, ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌తో సమన్వయం చేయనున్నారు. పటిష్ట పోలీస్‌ భద్రత, సీసీటీవీ పర్యవేక్షణలో నగరంలో ప్రశాంతంగా బక్రీద్‌, వినాయక నిమజ్జనం పూర్తి చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పాతబస్తీలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఓల్డ్‌సిటీలో కవాతు నిర్వహించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com