రాజ్‌నాథ్ సింగ్ ఇచ్చిన స్వేచ్ఛ తొలి ఫలితాన్ని ఇచ్చింది..

- September 20, 2016 , by Maagulf
రాజ్‌నాథ్ సింగ్ ఇచ్చిన స్వేచ్ఛ తొలి ఫలితాన్ని ఇచ్చింది..

భారత సైనికులను హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇచ్చిన స్వేచ్ఛ తొలి ఫలితాన్ని ఇచ్చింది. ఊరీ సెక్టార్‌లో ఉగ్రవాదుల చొరబడేందుకు వీలు కలిగేలా పాక్ దళాలు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డాయి. వేగంగా స్పందించిన భారత దళాలు పాక్ దాడులను తిప్పి కొట్టే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఆర్మీ డీజీకి ఫోన్ చేసి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో రెచ్చిపోయిన ఆర్మీ పాక్ దళాలపై విరుచుకుపడింది. కాల్పుల మాటున ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించాలన్న వ్యూహాన్ని భారత దళాలు సమర్థంగా తిప్పికొట్టాయి. ఆర్మీ కాల్పుల్లో కనీసం 9 మంది ఉగ్రవాదులు మృతి చెందారు. మరింతమంది మరణించి ఉండవచ్చిన ఆర్మీ అధికారులు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com