దుబాయ్ ఆన్ లైన్ బ్లడ్ డోనర్స్ వెబ్సైటుకి అనూహ్య స్పందన
- August 09, 2015
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో భారత దౌత్యవేత్త రక్తదాన ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు నడుం బిగించారు. ఆయన పేరు.. తిజు థామస్. అత్యవసర సందర్భాల్లో రక్తం అందుబాటులో లేక.. భారత్ తరహాలో రక్తదాతల సమాచారమూ లేక దుబాయ్లో, ఇతర ఎమిరేట్లలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ఆయన తొలిసారిగా రక్తదానం కోసం ఒక వెబ్సైట్ను నెలకొల్పారు. యూఏఈలో తెలుగువారు, తోటి భారతీయులు.. రక్తదానం ఆవశ్యకతపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ‘ఆంధ్ర జ్యోతి’ గల్ఫ్ ప్రతినిధితో మాట్లాడుతూ ఆయన చెప్పారు. అందుకే www.blooddonors.ae పేరిట పోర్టల్ ఏర్పాటు చేశామన్నారు. దీనికి దుబాయ్లో అనూహ్య స్పందన వస్తోందని తెలిపారు. దాదాపు 70వేల మంది సైట్ను సందర్శించారని, ఈ నేపథ్యంలో రక్తదానం ఆవ శ్యకత, రక్తదాతల వివరాలతో మొబైల్ యాప్ను రూపొందించే ప్రయత్నంలో ఉన్నట్టు వెల్లడించారు. ఇప్పటికే 1250 మంది రక్తదాతలు తమ సైట్లో పేరు నమోదు చేసుకున్నారని చెప్పారు. ఈ సైట్ను.. యుఏఈ సమాజానికి భారతీయుల బహుమతిగా అభివర్ణించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







