ఇరాక్ లో 300 మంది ఉద్యోగులను చంపిన ఐసిస్
- August 09, 2015
ఇరాక్లో ఐసిస్ ఉగ్రవాదులు మరో ఘాతుకానికి తెగపడ్డారు. ఏకంగా 300 మంది ఆ దేశ పౌరుల్ని దారుణంగా హత్యచేశారు. అక్కడి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఇరాక్ సుప్రీం ఎలక్టోరల్ కమిషన్లో పని చేస్తున్న 300 మంది ఉద్యోగుల్ని ఐసిస్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. నినెవెహ్ ప్రావిన్స్లోగల మోసూల్లో 50 మంది మహిళలను చంపారు. కమిషన్లో పని చేస్తున్న మొత్తం 300 మందిని చంపారని అధికారులు తెలిపారు. మరికొన్న చోట్ల కూడా ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా కమిషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. వెంటనే అంతర్జాతీయ, మానవహక్కుల సంఘాలు కల్పించుకొని ఈ దాడుల నుంచి ఇరాక్ పౌరుల్ని కాపాడాలని కోరారు. తమ కుటుంబసభ్యులను హతమార్చినట్లు ఉగ్రవాదులు ప్రకటించారని, అయితే వారి మృతదేహాలను మాత్రం అప్పగించలేదని బాధితుల కుటుంబసభ్యులు తెలిపారు. మోసూల్పై పట్టుసాధించిన ఐఎస్ ఉగ్రవాదులు.. ఉత్తర ఇరాక్లోని ఇతర నగరాలను అక్రమించుకునేందుకు ఈ రకమైన దాడులకు దిగుతున్నారు. అఫ్ఘాన్లో పేలుడు: 22మంది మృతి ఆఫ్ఘనిస్థాన్లోని కుందుజ్ ప్రావిన్స్లో శనివారం అర్ధరాత్రి కారు బాంబు పేలుడు సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 22 మంది మృతిచెందారు. ఖాన్ అబాద్ జిల్లాలో ఓ మిలిటెంట్ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









