రిషిత మరియు స్వర్ణ లను వరించిన ' ప్రవాసి స్త్రీ శక్తి' అవార్డు
- September 29, 2016అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ మరియు ప్రవాసి మిత్ర సంయుక్తంగా ప్రకటించిన "ప్రవాసి స్ర్తీశక్తి" అవార్డుకు శ్రీమతి రిషిత మరియు స్వర్ణ ఎంపికైనారు.
యూ.ఏ.ఈ.లోని తెలంగాణ సంక్షేమ సంఘం అయున ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్లో(ETCA) మహిళా సభ్యులుగా ఉంటూ తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను పరిరక్షిస్తూ, సామాజిక సేవలో చేస్తున్న కృషిని గుర్తించి వారికి ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నారు.
‘ప్రవాసీ బతుకమ్మ’ పేరుతో నిర్వహించే కార్యక్రమంలో,విదేశాల్లో ఉంటూ పలు రంగాల్లో సామాజిక కార్యక్రమాలలో కీలక పాత్ర పోషించే మహిళల ప్రతిభా పాటవాలను గుర్తించి ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. అక్టోబర్ 2న హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న జీవనజ్యోతి క్యాంపస్లో ఈ అవార్డులను నిర్వాహకులు ప్రదానం చేయనున్నారు.
ఈ సందర్భంగా ETCA వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు అయిన శ్రీ కిరణ్ కుమార్ పీచర గారు మరియు సంఘం సభ్యులు తమ అభినందనలు తెలియజేసారు.
ప్రవాసీ స్ర్తీశక్తి అవార్డుకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన శ్రీమతి రిషిత గుప్తా అన్నారు. కాగా హైదరాబాద్ కు చెందిన శ్రీమతి స్వర్ణ ముమ్మాడి గారు విదేశాల్లో ఉంటున్న భారతీయ మహిళల ప్రతిభా పాటవాలను గుర్తించి అవార్డులు ప్రదానం చేస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం