జాతి నిర్మాణంలో మహిళ పాత్రపై సెమినార్
- October 13, 2016
మస్కట్: ఒమనీ వర్క్ ఫోర్స్లో ఎక్కువమంది మహిళలకు అవకాశం కల్పించే దిశగా ఏడవ ఒమనీ విమెన్స్ డే సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ సోసల్ డెవలప్మెంట్ నిర్వహించిన సెమినార్లో చర్చ జరిగింది. 100 మందికి పైగా మహిళా ఎంటర్ప్రెన్యూర్స్, స్టూడెంట్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 'విమెన్ లీడర్షిప్ సెమినార్' పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ యాహ్యా బిన్ బాదర్ బిన్ మాలిక్ అల్ మావలి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచ ప్రఖ్యాత విమెన్ లీడర్ షిప్ ట్రైనర్ మరియు కోచ్ డాక్టర్ బెర్నిస్ లెడ్బెట్టర్ (సెంటర్ ఫర్ విమెన్ ఇన్ లీడర్షిప్, పెప్పర్డైన్ యూనివర్సిటీ, అమెరికా డైరెక్టర్) ఈ ఈవెంట్లో ట్రైనింగ్ సెషన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఒమన్టెల్ సిఇఓ తలాల్ బిన్ సైద్ మర్హూన్ మాట్లాడుతూ, మహిళలు పురుషులతో ఏ విషయంలోనూ తీసిపోలేరనీ, టాలెంట్ విషయంలో ఇద్దరూ ఒకటేనని అన్నారు. గత కొన్నాళ్ళుగా ఫిమేల్ స్టాఫ్ పెరుగుతూ వస్తున్నారని తలాల్ బిన్ వివరించారు.
తాజా వార్తలు
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా









