మల్టీ స్టారర్ సినిమాలకు ఆదరణ..
- November 08, 2016
మల్టీ స్టారర్ సినిమాలకు ఈ మధ్య కాలంలో మంచి ఆదరణ లభిస్తోంది. జూనియర్, సీనియర్ హీరోలు కూడా కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శకులు కొత్త కథలతో ముందుకు వస్తున్నారు. ఇటీవల ఊపిరి, జ్యో అచ్యుతానంద లాంటి మల్టీ స్టారర్ చిత్రాలకు మంచి ఆదరణ లభించగా, తాజాగా ఐదుగురు హీరోలతో ఓ మల్టీ స్టారర్ మూవీకి ప్లాన్ చేశారు. భలే మంచిరోజు ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండగా ఇందులో నాగ శౌర్య, నారా రోహిత్, సందీప్ కిషన్ లు హీరోలుగా నటించనున్నారట. ఇంక మరో ఇద్దరు హీరోలను వెతికే పనిలో ఉందట యూనిట్. ఈ చిత్రానికి సంబంధించిన కథ, కథనం కొత్తగా అనిపించడంతో హీరోలు కూడా ఈ ప్రాజెక్ట్ లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం చిత్రానికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోండగా త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









