బహ్రెయిన్ లో క్షమాభిక్ష అవధిని వినియోగించుకున్న 10,000 మంది ప్రవాసులు
- August 27, 2015
జులై నెల నుండి ఈ సంవత్సరాంతం వరకు కొనసాగే క్షమాభిక్ష కాల వ్యవధిని ఇప్పటివరకు సరైన పత్రాలు, అనుమతులు లేకుండా నివసిస్తున్న 10 వేలకుపైగా ప్రవాస కార్మికులు వినియోగించుకున్నారని, ఇది ఒక గొప్ప విజయమని, లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ ఆధారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అల్-అబ్సి అభివర్ణించారు. ఈ సంఖ్య గత 2007 మరియు 2009 సంవత్సరాలను కలిపిన సంఖ్య కంటే ఎక్కువని ఆయన తేల్చారు. ఈ 10వేల మందిలో 80 శాతం పైగా శ్రామికులు కొత్త యజమానుల వద్ద చేరగా, మిగిలినవారు తమ దేశాలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఈవిధంగా వెళ్ళేవారిని బ్లాక్ లిస్టులో పెట్టబోమన్నారు. ఇంకా, పాస్పోర్టులు యజమానుల వద్ద ఉండిపోయిన అక్రమ కార్మికులు, వెంటనే తమ ఎంబసీల వద్ద సంప్రదిస్తే, వారు జారీచేసే ఎమర్జన్సీ సర్టిఫికెట్ల ద్వారా , ఏ విధమయిన జరిమానా లేకుండానే తమ దేశానికి వెళ్ళవచ్చని తెలిపారు. శ్రామికుల నుండి క్రమబద్ధీకరణకు డబ్బు వసూలు చేసే మధ్యవర్తులను ఆయన హెచ్చరించారు; ఆ విధమైన కార్మికులు పోలీసువరికి పట్టుబడితే కనీసం 100 బహ్రెయిన్ దీనర్లు, అటువంటి కంపెనీలకు ఒకొక్క కార్మికునికి 1000 చొప్పున జరిమాన ఉంటుందని హెచ్చరించారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







