కేంద్ర తీసుకున్న నిర్ణయంతో సినిమా వాయిదా..?
- November 10, 2016
500, 1000 రూపాయల నోట్లు బ్యాన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సినీరంగాన్ని కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పటికే సెట్స్ మీద ఉన్న సినిమాలకు ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టగా ఈ వారం రిలీజ్ కావాల్సిన సినిమాలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనం దగ్గర డబ్బులు లేకపోవటంతో ఎంత మంది థియేటర్ల వరకు వస్తారో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.దీంతో చేసేదేమి లేక తమ సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాడు అల్లరి నరేష్. హర్రర్ కామెడీగా తెరకెక్కిన ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాను ముందుగా ఈ శుక్రవారం రిలీజ్ చేయాలని భావించారు.తరువాత ఒక్క రోజు ఆలస్యంగా శనివారం విడుదల చేయాలని నిర్ణయించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో వారం పాటు వాయిదా వేసి వచ్చే శుక్రవారం (నవంబర్ 18న) రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









