విక్రమ్,గౌతమ్ ల కొత్త చిత్రం
- November 12, 2016
'ఇరుముగన్' సినిమాతో కాస్త ట్రాక్లో పడ్డారు నటుడు విక్రం. త్వరలో ఆయన 'సామి 2' చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత లేకుంటే ఏకకాలంలో మరో చిత్రంలో కూడా నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి గౌతం మేనన్ దర్శకత్వం వహించనున్నారు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. దీని గురించి గౌతం మేనన్ మాట్లాడుతూ విక్రంతో ఓ సినిమాను రూపొందించేందుకు చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటించనున్నట్లు చెప్పారు. మరోవైపు 'ఇరుముగన్' ఫేమ్ ఆనంద్ శంకర్ వద్ద కూడా విక్రం కథ విన్నట్లు సమాచారం.
దీన్ని కూడా పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నారు విక్రం. కానీ గౌతం మేనన్ సినిమాకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నట్లు కోడంబాక్కం వర్గాలు గుసగుసలాడుతున్నాయి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







