మోదీతో కెసిఆర్ భేటీ
- November 19, 2016
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు ఢిల్లీవెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. దాదాపు గంటసేపు జరిగిన ఈ భేటీలో పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల ఇబ్బందులను మోదీకి సీఎం వివరించినట్టు తెలుస్తోంది. పాత పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ర్టానికి జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిందిగా కూడా కెసిఆర్ ప్రధానిని కోరినట్లు సమాచారం.
కేంద్రానికి చెల్లించాల్సిన పన్నుల్లో మారటోరియం విధించి వెసులుబాటు కల్పించాలని.. గృహిణులు దాచుకున్న మొత్తాన్ని నల్లధనంగా పరిగణించవద్దని కూడా సిఎం సూచించనట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా రూ. 500 నోట్లు అందుబాటులోకి తీసుకురావాలని.. గ్రామాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా పెద్ద నోట్ల మార్పిడి కొనసాగించాలని, ప్రైవేటు హాస్పిటల్స్ లోనూ పాతనోట్లు స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని మోదీకి కెసిఆర్ విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







