ఎన్నారైలకు తప్పని కష్టాలు
- November 19, 2016
వికాస్ దుబాయ్లో పది సంవత్సరాలుగా ఉద్యోగం చేసున్నాడు... ఇంట్లో వారికి నెలా ఖర్చుల కోసం కొంచం మొత్తాన్ని మనీ ట్రాన్స్ఫర్ సంస్థ ద్వారా పంపాడు.. కుటుంబసభ్యుల డబ్బుల కోసం మనదేశంలోని ఆ సంస్థ బ్రాంచి కార్యాలయంలో సంప్రదించగా తమ దగ్గర డబ్బు లేదని కావాలంటే చెక్ ఇస్తామని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు.
ఇది కేవలం ఏ వికాస్ కుటుంబానికో కాదు విదేశాల్లోని లక్షలాది ఎన్నారైలు తమ కుటుంబసభ్యులకు డబ్బులు పంపిస్తున్నా అవి వారికి చేరడం లేదు. పెద్ద నోట్ల రద్దుతో కరెన్సీ చలామణి తగ్గిపోవడంతో పాటు ట్రాన్స్ఫర్ సంస్థల వద్ద కొత్త కరెన్సీ లేకపోవడంతో ఈ సమస్య తలెత్తింది.
వాస్తవానికి ఎన్నారైలు మనీ ట్రాన్స్ఫర్ సంస్థలో డబ్బులు జమచేసి వెంటనే తమ కుటుంబసభ్యులకు ఆ సమాచారం తెలిపితే క్షణాల్లో వారు వెళ్లి డబ్బులు తీసుకువచ్చేవారు. క్షణాల్లో జరిగే కరెన్సీ బట్వాడా గత పదిరోజులుగా జరగకపోవడంతో లక్షలాదిమంది ఎన్నారైల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రతినెలా పిల్లలకు స్కూలు ఫీజు, బట్టలు, మతపరమైన కార్యక్రమాలకు చిన్నమొత్తాలను పంపిస్తుంటారు. అయితే ఆ డబ్బులు కుటుంబసభ్యులకు చేరకపోవడంతో ఎన్నారైలు ఆదుర్దాతో వున్నారు.
ఇటు కుటుంబసభ్యులు చేతిలో డబ్బులు లేక పలు అవస్థలు పడుతున్నారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







