ఎన్నారైలకు తప్పని కష్టాలు
- November 19, 2016వికాస్ దుబాయ్లో పది సంవత్సరాలుగా ఉద్యోగం చేసున్నాడు... ఇంట్లో వారికి నెలా ఖర్చుల కోసం కొంచం మొత్తాన్ని మనీ ట్రాన్స్ఫర్ సంస్థ ద్వారా పంపాడు.. కుటుంబసభ్యుల డబ్బుల కోసం మనదేశంలోని ఆ సంస్థ బ్రాంచి కార్యాలయంలో సంప్రదించగా తమ దగ్గర డబ్బు లేదని కావాలంటే చెక్ ఇస్తామని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు.
ఇది కేవలం ఏ వికాస్ కుటుంబానికో కాదు విదేశాల్లోని లక్షలాది ఎన్నారైలు తమ కుటుంబసభ్యులకు డబ్బులు పంపిస్తున్నా అవి వారికి చేరడం లేదు. పెద్ద నోట్ల రద్దుతో కరెన్సీ చలామణి తగ్గిపోవడంతో పాటు ట్రాన్స్ఫర్ సంస్థల వద్ద కొత్త కరెన్సీ లేకపోవడంతో ఈ సమస్య తలెత్తింది.
వాస్తవానికి ఎన్నారైలు మనీ ట్రాన్స్ఫర్ సంస్థలో డబ్బులు జమచేసి వెంటనే తమ కుటుంబసభ్యులకు ఆ సమాచారం తెలిపితే క్షణాల్లో వారు వెళ్లి డబ్బులు తీసుకువచ్చేవారు. క్షణాల్లో జరిగే కరెన్సీ బట్వాడా గత పదిరోజులుగా జరగకపోవడంతో లక్షలాదిమంది ఎన్నారైల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రతినెలా పిల్లలకు స్కూలు ఫీజు, బట్టలు, మతపరమైన కార్యక్రమాలకు చిన్నమొత్తాలను పంపిస్తుంటారు. అయితే ఆ డబ్బులు కుటుంబసభ్యులకు చేరకపోవడంతో ఎన్నారైలు ఆదుర్దాతో వున్నారు.
ఇటు కుటుంబసభ్యులు చేతిలో డబ్బులు లేక పలు అవస్థలు పడుతున్నారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు