ఎన్నారైలకు తప్పని కష్టాలు
- November 19, 2016
వికాస్ దుబాయ్లో పది సంవత్సరాలుగా ఉద్యోగం చేసున్నాడు... ఇంట్లో వారికి నెలా ఖర్చుల కోసం కొంచం మొత్తాన్ని మనీ ట్రాన్స్ఫర్ సంస్థ ద్వారా పంపాడు.. కుటుంబసభ్యుల డబ్బుల కోసం మనదేశంలోని ఆ సంస్థ బ్రాంచి కార్యాలయంలో సంప్రదించగా తమ దగ్గర డబ్బు లేదని కావాలంటే చెక్ ఇస్తామని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు.
ఇది కేవలం ఏ వికాస్ కుటుంబానికో కాదు విదేశాల్లోని లక్షలాది ఎన్నారైలు తమ కుటుంబసభ్యులకు డబ్బులు పంపిస్తున్నా అవి వారికి చేరడం లేదు. పెద్ద నోట్ల రద్దుతో కరెన్సీ చలామణి తగ్గిపోవడంతో పాటు ట్రాన్స్ఫర్ సంస్థల వద్ద కొత్త కరెన్సీ లేకపోవడంతో ఈ సమస్య తలెత్తింది.
వాస్తవానికి ఎన్నారైలు మనీ ట్రాన్స్ఫర్ సంస్థలో డబ్బులు జమచేసి వెంటనే తమ కుటుంబసభ్యులకు ఆ సమాచారం తెలిపితే క్షణాల్లో వారు వెళ్లి డబ్బులు తీసుకువచ్చేవారు. క్షణాల్లో జరిగే కరెన్సీ బట్వాడా గత పదిరోజులుగా జరగకపోవడంతో లక్షలాదిమంది ఎన్నారైల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రతినెలా పిల్లలకు స్కూలు ఫీజు, బట్టలు, మతపరమైన కార్యక్రమాలకు చిన్నమొత్తాలను పంపిస్తుంటారు. అయితే ఆ డబ్బులు కుటుంబసభ్యులకు చేరకపోవడంతో ఎన్నారైలు ఆదుర్దాతో వున్నారు.
ఇటు కుటుంబసభ్యులు చేతిలో డబ్బులు లేక పలు అవస్థలు పడుతున్నారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









