ఎన్నారైలకు తప్పని కష్టాలు
- November 19, 2016
వికాస్ దుబాయ్లో పది సంవత్సరాలుగా ఉద్యోగం చేసున్నాడు... ఇంట్లో వారికి నెలా ఖర్చుల కోసం కొంచం మొత్తాన్ని మనీ ట్రాన్స్ఫర్ సంస్థ ద్వారా పంపాడు.. కుటుంబసభ్యుల డబ్బుల కోసం మనదేశంలోని ఆ సంస్థ బ్రాంచి కార్యాలయంలో సంప్రదించగా తమ దగ్గర డబ్బు లేదని కావాలంటే చెక్ ఇస్తామని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు.
ఇది కేవలం ఏ వికాస్ కుటుంబానికో కాదు విదేశాల్లోని లక్షలాది ఎన్నారైలు తమ కుటుంబసభ్యులకు డబ్బులు పంపిస్తున్నా అవి వారికి చేరడం లేదు. పెద్ద నోట్ల రద్దుతో కరెన్సీ చలామణి తగ్గిపోవడంతో పాటు ట్రాన్స్ఫర్ సంస్థల వద్ద కొత్త కరెన్సీ లేకపోవడంతో ఈ సమస్య తలెత్తింది.
వాస్తవానికి ఎన్నారైలు మనీ ట్రాన్స్ఫర్ సంస్థలో డబ్బులు జమచేసి వెంటనే తమ కుటుంబసభ్యులకు ఆ సమాచారం తెలిపితే క్షణాల్లో వారు వెళ్లి డబ్బులు తీసుకువచ్చేవారు. క్షణాల్లో జరిగే కరెన్సీ బట్వాడా గత పదిరోజులుగా జరగకపోవడంతో లక్షలాదిమంది ఎన్నారైల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రతినెలా పిల్లలకు స్కూలు ఫీజు, బట్టలు, మతపరమైన కార్యక్రమాలకు చిన్నమొత్తాలను పంపిస్తుంటారు. అయితే ఆ డబ్బులు కుటుంబసభ్యులకు చేరకపోవడంతో ఎన్నారైలు ఆదుర్దాతో వున్నారు.
ఇటు కుటుంబసభ్యులు చేతిలో డబ్బులు లేక పలు అవస్థలు పడుతున్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







