త్వరలో మిషన్ సోషల్ మీడియా చేపడతాం - కమిషనర్ మహేందర్ రెడ్డి
- November 19, 2016మిషన్ చబుత్ర తరహాలో పాతబస్తీలో త్వరలో సోషల్ మీడియా మిషన్ చేపడతామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకరమయిన పోస్టింగ్లు పెట్టి ప్రజల మధ్య చిచ్చు పెట్టేవారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. సాలార్జంగ్ మ్యూజియంలో శనివారం ముస్లిం మతపెద్దలతో సౌత జోన్ పోలీసులు సోషల్ మీడియాలో రెండు వర్గాల మధ్య వివాదాలు అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ఫోస్టింగ్లు వస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయాలన్నారు. పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఏసీపీకి లేదా డీసీపీ దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పేట్లబురుజు సీఏఆర్ అడిషనల్ కమిషనర్ శివప్రసాద్, దక్షిణమండల డీసీపీ వి.సత్యనారాయణ, అడిషనల్ డీసీపీ బాబురావు, ముస్లిం మత పెద్దలు మౌలానా ముఫ్తిఖలీల్ అహ్మద్, మౌలానా సయ్యద్ అలీ హుసేని, అలీ ముస్తఫా ఖాద్రి, అహ్మద్ హుసైన్ ఖాద్రి, హైదర్ ఆగా, ముర్తుజా పాషా, ఖుబుల్ పాషా శతారి, హాఫిజ్ ముజఫర్ హుసేన్ బందనవాజీ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు