త్వరలో మిషన్ సోషల్‌ మీడియా చేపడతాం - కమిషనర్‌ మహేందర్‌ రెడ్డి

- November 19, 2016 , by Maagulf
త్వరలో మిషన్ సోషల్‌ మీడియా చేపడతాం - కమిషనర్‌ మహేందర్‌ రెడ్డి

మిషన్‌ చబుత్ర తరహాలో పాతబస్తీలో త్వరలో సోషల్‌ మీడియా మిషన్‌ చేపడతామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌ రెడ్డి పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో అసభ్యకరమయిన పోస్టింగ్‌లు పెట్టి ప్రజల మధ్య చిచ్చు పెట్టేవారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. సాలార్‌జంగ్‌ మ్యూజియంలో శనివారం ముస్లిం మతపెద్దలతో సౌత జోన్‌ పోలీసులు సోషల్‌ మీడియాలో రెండు వర్గాల మధ్య వివాదాలు అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే ఫోస్టింగ్‌లు వస్తే వెంటనే స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఏసీపీకి లేదా డీసీపీ దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు.

కార్యక్రమంలో పేట్లబురుజు సీఏఆర్‌ అడిషనల్‌ కమిషనర్‌ శివప్రసాద్‌, దక్షిణమండల డీసీపీ వి.సత్యనారాయణ, అడిషనల్‌ డీసీపీ బాబురావు, ముస్లిం మత పెద్దలు మౌలానా ముఫ్తిఖలీల్‌ అహ్మద్‌, మౌలానా సయ్యద్‌ అలీ హుసేని, అలీ ముస్తఫా ఖాద్రి, అహ్మద్‌ హుసైన్‌ ఖాద్రి, హైదర్‌ ఆగా, ముర్తుజా పాషా, ఖుబుల్‌ పాషా శతారి, హాఫిజ్‌ ముజఫర్‌ హుసేన్‌ బందనవాజీ, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com