మటన్ రిసిపీ డాటా స్టయిల్
- November 24, 2016కావలసిన పదార్థాలు: మటన్: అరకిలో, గుడ్లు: ఆరు, అల్లం వెల్లుల్లి ముద్ద: రెండు టేబుల్ స్పూన్లు, టమోటాలు: మూడు(చిన్నగా ముక్కలు చేసుకోవాలి), బ్రెడ్ ముక్కలు: రెండు (నీటిలో నానపెట్టుకోవాలి), బాదం, జీడిపప్పు: ఐదారు స్పూన్లు, పచ్చిమిరపకాయలు: ఆరు(సన్నగా తరిగి పెట్టుకోవాలి), కారం: తగినంత, మిరియాల పొడి: రెండు టేబుల్ స్పూను, జీలకర్ర పొడి: రెండు టేబుల్ స్పూన్లు, పెరుగు: కప్పు, ఉప్పు: తగినంత, నెయ్యి: కప్పు, కొత్తిమీర తగినంత, ఉల్లిపాయలు: రెండు(ముక్కలుగా చేసుకోవాలి).
తయారీవిధానం: జీడిపప్పు, బాదం పప్పులను ముందురోజు రాత్రి నానపెట్టి తెల్లవారి వాటిని మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. మటన్ ముక్కలను శుభ్రం చేసుకొని వాటిని అల్లం వెల్లుల్లి ముద్ద, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి ఓ గంట పాటు నాననివ్వాలి. ఇప్పుడు మందపాటి గిన్నెలో నెయ్యి వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయల ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత జీడిపప్పు ముద్ద వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఈ మిశ్రమం ఉడుకుతున్న సమయంలో నానపెట్టి వుంచుకున్న మటన్ ముక్కలను వేసి నీరు పోయకుండా ఉడికించాలి. ఇప్పుడు టమోటా ముక్కలనువేసి అవసరం అనుకుంటే కొద్దిగా నీరు పోసి బాగా ఉడికించాలి. మటన్ ఉడికిన తరువాత నానపెట్టిన బ్రెడ్ ముక్కలను వేసి సన్నని మంట మీద ఉడికించాలి. ఇప్పుడు గుడ్లు పగులకొట్టి ఉప్పు, కారం వేసి బాగా గిలకొట్టాలి. అందులో సగ భాగాన్ని పాన్లో ఆమ్లెట్లాగా వేసుకోవాలి. ఓవెన్ బౌల్ అడుగుభాగాన ఈ ఆమ్లెట్ను, పై భాగాన ఉడికిన మటన్ కర్రీ వేసి పైన మిగిలిన గుడ్లును పలుచగా పరిచి, ఓవెన్లో ఐదు నుంచి పది నిమిషాల పాటు బేక్ చేయాలి. ఓవెన్లోంచి బయటకు తీసిన తరువాత పైన కొత్తిమీర చల్లుకోవాలి.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు