ఆరుగురు తీవ్రవాద అనుమానితులకు జీవిత ఖైదు
- November 24, 2016మనామా: హై క్రిమినల్ కోర్ట్, ఆరుగురు తీవ్రవాద అనుమానితులకు జీవిత ఖైదు విధించింది. పేలుడు పదార్థాలను కలిగి ఉన్నారనీ, వాటిని వినియోగించారనే అభియోగాలు వారిపై మోపబడ్డాయి. మమీర్లో ఓ పోలీస్ అధికారిని చంపేందుకు కూడా ఈ వ్యక్తులు కుట్ర పన్నిన కేసులో దోషులుగా తేలారని చీఫ్ ప్రాజిక్యూటర్ హమాద్ షహీన్ చెప్పారు. 2015 మే 30న మమీర్ విలేజ్లో బాంబుల్ని పెట్టి ఓ పోలీస్ అధికారిని చంపడానికి ప్లాన్ చేశారు. అనుమానాస్పదంగా అక్కడే నక్కి ఉన్నవారిని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత బాంబుని కనుగొని నిర్వీర్యం చేశారు. దాంతో పెను ప్రమాదం తప్పింది. బాంబు ఒకవేళ పేలి ఉంటే తీవ్రమైన నష్టం వాటిల్లేది. అన్ని వాదనల్నీ విన్న న్యాయస్థానం, సాక్ష్యాధారాల్ని పరిశీలించి, నిందితులకు జీవిత ఖైదును విధించింది. నిందితుల తరఫున కూడా వాదనలకు ఆస్కారం కలిగిందిగానీ, నేర నిరూపణ అవడంతో నిందితులకు శిక్ష తప్పలేదు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు