తెలుగు వారిని నయవంచన చేస్తున్న భారత్ కేంద్ర ప్రభుత్వం
- September 04, 2015
ఆరాటం తీరాలంటే పోరాటాలే చెయ్యాలా..? చంద్రబాబుది మధ్యే మార్గమా? రావాల్సిన ప్రత్యేక హోదా రాదని తేలిపోయింది. రోడ్డు మ్యాపులేసి గీసిన గీతలే మళ్ళీ మళ్ళీ గీసి అరిగిపోయిన గ్రాంఫోను రికార్డుల్ని మోగిస్తున్న కేంద్రం మీద ఆశలు వదిలేసుకోవాలని చెప్పక తప్పదు. కావాల్సింది నిధులేగా...ఏ రాయైతేనేం పళ్ళూడ గొట్టుకోవడానికని అనుకోవడానికి వీల్లేదు! ఆ బీహారుకు మోడీ ప్రకటించిన లక్షాపాతికవేల కోట్లు ఎన్నికల ముందు చేసిన వాగ్దానం అని ఎందుకనుకోకూడదు? నోటి మాటే కదా..అక్కడ బీజేపీ గెల్చినా అంతంత డబ్బు ఇస్తాడన్న గ్యారెంటీ లేదు. మరేం చెయ్యాలి..చంద్రబాబు కింకర్తవ్యం ఏంటి..? అసలే కులరాజకీయాలు,ముఠాతగాదాలు,కాంట్రాక్టర్ల కుమ్ములాటలతో కునారిల్లుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే..ఏం చెయ్యాలి..జవాబు జనం నుంచి రావాలి.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







