ఒమాన్ లో ఆగ్రహించిన ప్రకృతి- వర్ష ప్రకోపానికి ముగ్గురి మృతి
- September 04, 2015
ఒమాన్ ఉత్తర భాగంలో కురిసిన భారీ వర్షాలకు ముగ్గురు బలికాగా, రుస్తాక్ మరియు ముత్త్రాలలో ఒకొక్కరూ చొప్పున గల్లంతయ్యారు. వారికోసం పోలీసు హెలికాప్టర్లు గాలిస్తున్నాయి. ఘూబ్రా లోని మస్కట్ గ్రాండ్ మాల్ పైకప్పులో కొంత భాగం కూలిపోయింది. వర్షం, గాలులు ఇసుక దుమారం తో కూడిన వాతావరణం, ఒమాన్ జన జీవితాన్ని స్తంభింపజేసింది. ఐతే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము వాహనాలు, అంబులెన్స్ లతో సర్వసన్నద్ధంగా ఉన్నామని పోలీసు శాఖ వారు హామీ ఇచ్చారు. రానున్న 48 గంటలలో ఒమాన్ ఉత్తర మరియు మధ్య భాగాల్లో మరింతగా వర్షాలు కురిసే అవకాశముందని దేశ వాతావరణ శాఖ వారు ప్రకటించారు. సముద్రం పరిస్థితి తీవ్రంగా ఉందని, 3 మీటర్ల ఎత్తు వరకు అలలూ ఎగిసిపడే అవకాశముందని, ఎవరైన ఇలాంటి వాతావరణంలో వాడీ ని దాటాడానికి ప్రయత్నించే ముందు తమ పిల్లలను, కుటుంబాన్ని గురించి ఆలోచించాలని అధికారులు హెచ్చరించారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







