ఒమాన్ లో ఆగ్రహించిన ప్రకృతి- వర్ష ప్రకోపానికి ముగ్గురి మృతి
- September 04, 2015
ఒమాన్ ఉత్తర భాగంలో కురిసిన భారీ వర్షాలకు ముగ్గురు బలికాగా, రుస్తాక్ మరియు ముత్త్రాలలో ఒకొక్కరూ చొప్పున గల్లంతయ్యారు. వారికోసం పోలీసు హెలికాప్టర్లు గాలిస్తున్నాయి. ఘూబ్రా లోని మస్కట్ గ్రాండ్ మాల్ పైకప్పులో కొంత భాగం కూలిపోయింది. వర్షం, గాలులు ఇసుక దుమారం తో కూడిన వాతావరణం, ఒమాన్ జన జీవితాన్ని స్తంభింపజేసింది. ఐతే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము వాహనాలు, అంబులెన్స్ లతో సర్వసన్నద్ధంగా ఉన్నామని పోలీసు శాఖ వారు హామీ ఇచ్చారు. రానున్న 48 గంటలలో ఒమాన్ ఉత్తర మరియు మధ్య భాగాల్లో మరింతగా వర్షాలు కురిసే అవకాశముందని దేశ వాతావరణ శాఖ వారు ప్రకటించారు. సముద్రం పరిస్థితి తీవ్రంగా ఉందని, 3 మీటర్ల ఎత్తు వరకు అలలూ ఎగిసిపడే అవకాశముందని, ఎవరైన ఇలాంటి వాతావరణంలో వాడీ ని దాటాడానికి ప్రయత్నించే ముందు తమ పిల్లలను, కుటుంబాన్ని గురించి ఆలోచించాలని అధికారులు హెచ్చరించారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు









