ఒమాన్ లో ఆగ్రహించిన ప్రకృతి- వర్ష ప్రకోపానికి ముగ్గురి మృతి
- September 04, 2015
ఒమాన్ ఉత్తర భాగంలో కురిసిన భారీ వర్షాలకు ముగ్గురు బలికాగా, రుస్తాక్ మరియు ముత్త్రాలలో ఒకొక్కరూ చొప్పున గల్లంతయ్యారు. వారికోసం పోలీసు హెలికాప్టర్లు గాలిస్తున్నాయి. ఘూబ్రా లోని మస్కట్ గ్రాండ్ మాల్ పైకప్పులో కొంత భాగం కూలిపోయింది. వర్షం, గాలులు ఇసుక దుమారం తో కూడిన వాతావరణం, ఒమాన్ జన జీవితాన్ని స్తంభింపజేసింది. ఐతే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము వాహనాలు, అంబులెన్స్ లతో సర్వసన్నద్ధంగా ఉన్నామని పోలీసు శాఖ వారు హామీ ఇచ్చారు. రానున్న 48 గంటలలో ఒమాన్ ఉత్తర మరియు మధ్య భాగాల్లో మరింతగా వర్షాలు కురిసే అవకాశముందని దేశ వాతావరణ శాఖ వారు ప్రకటించారు. సముద్రం పరిస్థితి తీవ్రంగా ఉందని, 3 మీటర్ల ఎత్తు వరకు అలలూ ఎగిసిపడే అవకాశముందని, ఎవరైన ఇలాంటి వాతావరణంలో వాడీ ని దాటాడానికి ప్రయత్నించే ముందు తమ పిల్లలను, కుటుంబాన్ని గురించి ఆలోచించాలని అధికారులు హెచ్చరించారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









