ఒమాన్ లో ఆగ్రహించిన ప్రకృతి- వర్ష ప్రకోపానికి ముగ్గురి మృతి
- September 04, 2015
ఒమాన్ ఉత్తర భాగంలో కురిసిన భారీ వర్షాలకు ముగ్గురు బలికాగా, రుస్తాక్ మరియు ముత్త్రాలలో ఒకొక్కరూ చొప్పున గల్లంతయ్యారు. వారికోసం పోలీసు హెలికాప్టర్లు గాలిస్తున్నాయి. ఘూబ్రా లోని మస్కట్ గ్రాండ్ మాల్ పైకప్పులో కొంత భాగం కూలిపోయింది. వర్షం, గాలులు ఇసుక దుమారం తో కూడిన వాతావరణం, ఒమాన్ జన జీవితాన్ని స్తంభింపజేసింది. ఐతే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము వాహనాలు, అంబులెన్స్ లతో సర్వసన్నద్ధంగా ఉన్నామని పోలీసు శాఖ వారు హామీ ఇచ్చారు. రానున్న 48 గంటలలో ఒమాన్ ఉత్తర మరియు మధ్య భాగాల్లో మరింతగా వర్షాలు కురిసే అవకాశముందని దేశ వాతావరణ శాఖ వారు ప్రకటించారు. సముద్రం పరిస్థితి తీవ్రంగా ఉందని, 3 మీటర్ల ఎత్తు వరకు అలలూ ఎగిసిపడే అవకాశముందని, ఎవరైన ఇలాంటి వాతావరణంలో వాడీ ని దాటాడానికి ప్రయత్నించే ముందు తమ పిల్లలను, కుటుంబాన్ని గురించి ఆలోచించాలని అధికారులు హెచ్చరించారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







