58,0000 ఇండియన్స్కి ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్
- December 19, 2016
గడచిన రెండేళ్ళలో గల్ఫ్ దేశాల్లో ఎంప్లాయ్మెంట్ కోసం 58,000 మంది భారతీయ వర్కర్స్కి ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ లభించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రాజ్యసభలో ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి వికె సింగ్ సమాధానమిస్తూ ఈ వివరాల్ని వెల్లడించారు. సౌదీ అరేబియాలో ఎంప్లాయర్స్ నుంచి ఎదురవుతున్న సమస్యలపై ఇండియన్ వర్కర్స్ పలు ఫిర్యాదులు చేశారనీ, వాటిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని ఆయన తెలిపారు. 2014 సెప్టెంబర్ నుంచి ఇప్పటిదాకా ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ లభించిన భారతీయ మైగ్రెంట్ డొమెస్టిక్ వర్కర్స్ సంఖ్య 58,163 అని ఆయన పేర్కొన్నారు. 207 దేశాల్లో నివసిస్తున్న భారతీయుల సంఖ్య 31.73గా ఉందని, ఇందులో 13.45 మిలియన్ల మంది ఎన్ఆర్ఐలు కాగా, 17.85 మంది ఇండియన్ ఆరిజన్ కలవారని సమాధానంలో ప్రస్తావించారు కేంద్ర మంత్రి. ప్రభుత్వం 1,121 ఫిర్యాదుల్ని డిసెంబర్ 2012 నుంచి ఇప్పటిదాకా అందుకుందనీ, అందులో 973 ఫిర్యాదుల్ని రాష్ట్ర ప్రభుత్వాలకు రిఫర్ చేసినట్లు తెలిపారు. విడాకులు మంజూరయినట్లయితే పిల్లల పాస్పోర్ట్ విషయంలో తల్లిదండ్రులిద్దరి సంతకం కంపల్సరీ కాదనీ, ఎవరో ఒకరి అనుమతి ఉంటే సరిపోతుందని అన్నారాయన.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









