జనవరి 8 నుంచి ఇండియన్ స్కూల్స్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్
- January 05, 2017
మస్కట్: మస్కట్లోని ఇండియన్ స్కూల్స్లో అడ్మిషన్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జనవరి 8న ప్రారంభం కానుంది. కెజి నుంచి 9వ తరగతి వరకు ఈ అడ్మిషన్లు ఉంటాయి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ - ఇండియన్ స్కూల్స్ ఇన్ ఒమన్ ఈ సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. పేరెంట్స్కి, అలాగే స్కూల్స్కి ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇండియన్ స్కూల్ మస్కట్, ఇండియన్ స్కూల్ దర్సైత్, ఇండియన్ స్కూల్ వాడి కబిర్, ఇండియన్ స్కూల్ గుబ్రా, ఇండియన్ స్కూల్ సీబ్, ఇండియన్ స్కూల్ మయీబెలా తదిర స్కూళ్ళకు ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ని అందుబాటులోకి తెచ్చారు. ఫిబ్రవరి 15తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుంది. ఆన్లైన్ ద్వారా పూర్తి చేసిన అప్లికేషన్ని, అవసరమైన డాక్యమెంట్లతోపాటు పైన పేర్కొనబడిన ఆరు స్కూళ్ళలో ఏదో ఒక దాంట్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. వెబ్సైట్లోనూ పేరెంట్స్కి పూర్తి వివరాలు అందుబాటులో ఉంచారు.
తాజా వార్తలు
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!









