జనవరి 8 నుంచి ఇండియన్ స్కూల్స్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్
- January 05, 2017మస్కట్: మస్కట్లోని ఇండియన్ స్కూల్స్లో అడ్మిషన్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జనవరి 8న ప్రారంభం కానుంది. కెజి నుంచి 9వ తరగతి వరకు ఈ అడ్మిషన్లు ఉంటాయి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ - ఇండియన్ స్కూల్స్ ఇన్ ఒమన్ ఈ సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. పేరెంట్స్కి, అలాగే స్కూల్స్కి ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇండియన్ స్కూల్ మస్కట్, ఇండియన్ స్కూల్ దర్సైత్, ఇండియన్ స్కూల్ వాడి కబిర్, ఇండియన్ స్కూల్ గుబ్రా, ఇండియన్ స్కూల్ సీబ్, ఇండియన్ స్కూల్ మయీబెలా తదిర స్కూళ్ళకు ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ని అందుబాటులోకి తెచ్చారు. ఫిబ్రవరి 15తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుంది. ఆన్లైన్ ద్వారా పూర్తి చేసిన అప్లికేషన్ని, అవసరమైన డాక్యమెంట్లతోపాటు పైన పేర్కొనబడిన ఆరు స్కూళ్ళలో ఏదో ఒక దాంట్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. వెబ్సైట్లోనూ పేరెంట్స్కి పూర్తి వివరాలు అందుబాటులో ఉంచారు.
తాజా వార్తలు
- యూట్యూబ్ భారీ షాక్.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు..
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు