బహ్రైన్ లోని జింజ్ లో తగలబడిన పాడుబడ్డ ఇల్లు
- September 10, 2015
నిన్న బహ్రైన్ దేశంలోని జింజ్ లో హైవే 35లో ఉన్న షేక్ ఇస్ బిన్ సల్మాన్ హైవే పరిధిలోకి వచ్చే మంటలు రేగుతున్న పాత ఇంటిని ఆర్పి, పరిస్థితిని అదుపులోకి తేవడానికి అగ్నిమాపక సిబ్బంది రెండుగంటల పాటు శ్రమించారు. సాయంత్రం 5.30 గంటలకు దారిన వెళుతున్న వ్యక్తినించి సమాచారం అందుకున్న పౌర భద్రత దళం వారు ప్రమాదస్థలానికి 3 ఫైర్ ఇంజన్లు, అత్యవసర పరిస్థితి ఎదుర్కోవడానికి అంబులెన్స్ ను కూడా రప్పించారు. ప్రత్యక్ష సాక్షి కధనం ప్రకారం, మంటలు చాలా తీవ్రంగా ఉన్నాయని, ఐతే ఎవరూ గాయపడలేదని తెలిసింది. ఇల్లు పూర్తిగా 100 శాతం కాలిపోయిందని, ఐతే అదృష్టవశాత్తూ పక్కనున్న భవనంపై మాత్రం అంతగా ప్రభావం పడలేదని అక్కడి అధికారి చెప్పారు. అత్యవసర పరిస్థితి ఎదుర్కోవడానికి అంబులెన్స్ ను కూడా రప్పించారు. ఇంటిలో ఎవరూ లేరని, చాలరోజుల బట్టి ఖాళీగా ఉన్నందువలన చెత్త చెదారం పేరుకొని, రాపిడి వలన అంతుకొని ఉండచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







