అబుధాబి లోని భారత రాయబారి ని కలిసిన తెలంగాణ ప్రవాసులు
- January 10, 2017
తెలంగాణ కు చెందిన వలస కార్మిక నాయకులు పి.నారాయణ స్వామి నాయకత్వంలో ఐదుగురు సభ్యుల బృందం బెంగళూరు లో జరుగుతున్న ప్రవాసి భారతీయ దివస్-2017 ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ నెల 9 న సోమవారం కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు డా. వికె సింగ్, ఎంజె అక్బర్ లను కలిసి ఎన్నారైలు, ప్రవాసి కార్మికుల సంక్షేమానికి భారత ప్రభుత్వం తీసుకోవలసిన చర్యల గురించి విజ్ఞప్తి చేశారు. వీరితో పాటు దుబాయికి చెందిన గిరీష్ పంత్, షార్జాకు చెందిన జనగామ శ్రీనివాస్ ఉన్నారు.
యు.ఏ.ఈ దేశంలోని అబుధాబి లోని భారత రాయబారి నవదీప్ సూరి ని కలిసి గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావించారు. భారత్ - యు.ఏ.ఈ దేశాల మధ్య కుదిరిన ఖైదీల బదిలీ ఒప్పందం అమలు, దుబాయి జైల్లో ఉన్న సిరిసిల్ల కు చెందిన ఐదుగురు ఖైదీల విడుదల, షార్జా జైల్లో ఉన్న మూటపల్లి కి చెందిన ధరూరి బుచ్చయ్య విడుదల గురించి విజ్ఞప్తి చేశారు. అబుదాబి అగ్ని ప్రమాదం లో మరణించిన తెలంగాణకు చెందిన ఐదుగురి మృత దేహాలను త్వరగా పంపాలని విజ్ఞప్తి చేశారు.




తాజా వార్తలు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!







