అబుధాబి లోని భారత రాయబారి ని కలిసిన తెలంగాణ ప్రవాసులు
- January 10, 2017తెలంగాణ కు చెందిన వలస కార్మిక నాయకులు పి.నారాయణ స్వామి నాయకత్వంలో ఐదుగురు సభ్యుల బృందం బెంగళూరు లో జరుగుతున్న ప్రవాసి భారతీయ దివస్-2017 ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ నెల 9 న సోమవారం కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు డా. వికె సింగ్, ఎంజె అక్బర్ లను కలిసి ఎన్నారైలు, ప్రవాసి కార్మికుల సంక్షేమానికి భారత ప్రభుత్వం తీసుకోవలసిన చర్యల గురించి విజ్ఞప్తి చేశారు. వీరితో పాటు దుబాయికి చెందిన గిరీష్ పంత్, షార్జాకు చెందిన జనగామ శ్రీనివాస్ ఉన్నారు.
యు.ఏ.ఈ దేశంలోని అబుధాబి లోని భారత రాయబారి నవదీప్ సూరి ని కలిసి గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావించారు. భారత్ - యు.ఏ.ఈ దేశాల మధ్య కుదిరిన ఖైదీల బదిలీ ఒప్పందం అమలు, దుబాయి జైల్లో ఉన్న సిరిసిల్ల కు చెందిన ఐదుగురు ఖైదీల విడుదల, షార్జా జైల్లో ఉన్న మూటపల్లి కి చెందిన ధరూరి బుచ్చయ్య విడుదల గురించి విజ్ఞప్తి చేశారు. అబుదాబి అగ్ని ప్రమాదం లో మరణించిన తెలంగాణకు చెందిన ఐదుగురి మృత దేహాలను త్వరగా పంపాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు