మక్కా క్రేన్ దుర్ఘటనలో బాధితులకు 1 మిలియన్ రియాళ్ల నష్టపరిహారం
- September 16, 2015
మక్కా క్రేన్ దుర్ఘటన మృతుల కుటుంబాలకు ఒకొక్కరికి 1 మిలియన్ (పది లక్షల) రియాళ్లను, గాయపడిన వారికి అర మిలియన్(5 లక్షల) రియాళ్లను సౌదీ అధినేత కింగ్ సల్మాన్ నష్టపరిహారంగా ప్రకటించారు. ఇంకా మృతుల కుటుంబాల నుండి ఇద్దరికి చొప్పున హజ్-2016 యాత్ర లో సౌదీ రాజు గారి అతిధ్యం పొందుతారని వాగ్దానం చేశారు.
ఈ సంఘటనపై ఏర్పాటుచేసిన దర్యాప్తు కమిషన్, ఆ శుక్రవారం 107 గురి మృతికి, 400 మంది గాయపడడానికి కారణమైన క్రేన్ దుర్ఘటనకు బిన్ లాదిన్ గ్రూపు కంపెనీ వారే కారణమని తేల్చింది. ఈ కంపెనీ వారు భద్రత ప్రమాణాలను పాటించకపోవడం వలనే తుఫాను గాలులకు నిలువలేక క్రేన్ పడిపోయిందని తేల్చారు. న్యాయపరమైన విచారణ పూర్తయ్యే వరకు, సౌదీని విడిచి వెళ్లరాదని ఆ కంపెనీ ఉద్యోగులను ఆదేశించారు. కొత్త పబ్లిక్ ప్రాజెక్టులు నిర్వహించడానికి ఈ కంపెనీకి అనుమతిని రద్దు చేసింది. ఈ కంపెనీ గత 4 సంవత్సరాలుగా, రెండు మిలియన్ల మందికి ఆశ్రయమిచ్చేలా గ్రాండ్ మసీదును 4,00,000 (నాలుగు లక్షల) చదరపు మీటర్లమేరకు విస్తరించే పనిలో ఉన్న సంగతి విదితమే.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







