మక్కా క్రేన్ దుర్ఘటనలో బాధితులకు 1 మిలియన్ రియాళ్ల నష్టపరిహారం
- September 16, 2015
మక్కా క్రేన్ దుర్ఘటన మృతుల కుటుంబాలకు ఒకొక్కరికి 1 మిలియన్ (పది లక్షల) రియాళ్లను, గాయపడిన వారికి అర మిలియన్(5 లక్షల) రియాళ్లను సౌదీ అధినేత కింగ్ సల్మాన్ నష్టపరిహారంగా ప్రకటించారు. ఇంకా మృతుల కుటుంబాల నుండి ఇద్దరికి చొప్పున హజ్-2016 యాత్ర లో సౌదీ రాజు గారి అతిధ్యం పొందుతారని వాగ్దానం చేశారు.
ఈ సంఘటనపై ఏర్పాటుచేసిన దర్యాప్తు కమిషన్, ఆ శుక్రవారం 107 గురి మృతికి, 400 మంది గాయపడడానికి కారణమైన క్రేన్ దుర్ఘటనకు బిన్ లాదిన్ గ్రూపు కంపెనీ వారే కారణమని తేల్చింది. ఈ కంపెనీ వారు భద్రత ప్రమాణాలను పాటించకపోవడం వలనే తుఫాను గాలులకు నిలువలేక క్రేన్ పడిపోయిందని తేల్చారు. న్యాయపరమైన విచారణ పూర్తయ్యే వరకు, సౌదీని విడిచి వెళ్లరాదని ఆ కంపెనీ ఉద్యోగులను ఆదేశించారు. కొత్త పబ్లిక్ ప్రాజెక్టులు నిర్వహించడానికి ఈ కంపెనీకి అనుమతిని రద్దు చేసింది. ఈ కంపెనీ గత 4 సంవత్సరాలుగా, రెండు మిలియన్ల మందికి ఆశ్రయమిచ్చేలా గ్రాండ్ మసీదును 4,00,000 (నాలుగు లక్షల) చదరపు మీటర్లమేరకు విస్తరించే పనిలో ఉన్న సంగతి విదితమే.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







