మక్కా క్రేన్ దుర్ఘటనలో బాధితులకు 1 మిలియన్ రియాళ్ల నష్టపరిహారం
- September 16, 2015
మక్కా క్రేన్ దుర్ఘటన మృతుల కుటుంబాలకు ఒకొక్కరికి 1 మిలియన్ (పది లక్షల) రియాళ్లను, గాయపడిన వారికి అర మిలియన్(5 లక్షల) రియాళ్లను సౌదీ అధినేత కింగ్ సల్మాన్ నష్టపరిహారంగా ప్రకటించారు. ఇంకా మృతుల కుటుంబాల నుండి ఇద్దరికి చొప్పున హజ్-2016 యాత్ర లో సౌదీ రాజు గారి అతిధ్యం పొందుతారని వాగ్దానం చేశారు.
ఈ సంఘటనపై ఏర్పాటుచేసిన దర్యాప్తు కమిషన్, ఆ శుక్రవారం 107 గురి మృతికి, 400 మంది గాయపడడానికి కారణమైన క్రేన్ దుర్ఘటనకు బిన్ లాదిన్ గ్రూపు కంపెనీ వారే కారణమని తేల్చింది. ఈ కంపెనీ వారు భద్రత ప్రమాణాలను పాటించకపోవడం వలనే తుఫాను గాలులకు నిలువలేక క్రేన్ పడిపోయిందని తేల్చారు. న్యాయపరమైన విచారణ పూర్తయ్యే వరకు, సౌదీని విడిచి వెళ్లరాదని ఆ కంపెనీ ఉద్యోగులను ఆదేశించారు. కొత్త పబ్లిక్ ప్రాజెక్టులు నిర్వహించడానికి ఈ కంపెనీకి అనుమతిని రద్దు చేసింది. ఈ కంపెనీ గత 4 సంవత్సరాలుగా, రెండు మిలియన్ల మందికి ఆశ్రయమిచ్చేలా గ్రాండ్ మసీదును 4,00,000 (నాలుగు లక్షల) చదరపు మీటర్లమేరకు విస్తరించే పనిలో ఉన్న సంగతి విదితమే.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







