మక్కా క్రేన్ దుర్ఘటనలో బాధితులకు 1 మిలియన్ రియాళ్ల నష్టపరిహారం
- September 16, 2015
మక్కా క్రేన్ దుర్ఘటన మృతుల కుటుంబాలకు ఒకొక్కరికి 1 మిలియన్ (పది లక్షల) రియాళ్లను, గాయపడిన వారికి అర మిలియన్(5 లక్షల) రియాళ్లను సౌదీ అధినేత కింగ్ సల్మాన్ నష్టపరిహారంగా ప్రకటించారు. ఇంకా మృతుల కుటుంబాల నుండి ఇద్దరికి చొప్పున హజ్-2016 యాత్ర లో సౌదీ రాజు గారి అతిధ్యం పొందుతారని వాగ్దానం చేశారు.
ఈ సంఘటనపై ఏర్పాటుచేసిన దర్యాప్తు కమిషన్, ఆ శుక్రవారం 107 గురి మృతికి, 400 మంది గాయపడడానికి కారణమైన క్రేన్ దుర్ఘటనకు బిన్ లాదిన్ గ్రూపు కంపెనీ వారే కారణమని తేల్చింది. ఈ కంపెనీ వారు భద్రత ప్రమాణాలను పాటించకపోవడం వలనే తుఫాను గాలులకు నిలువలేక క్రేన్ పడిపోయిందని తేల్చారు. న్యాయపరమైన విచారణ పూర్తయ్యే వరకు, సౌదీని విడిచి వెళ్లరాదని ఆ కంపెనీ ఉద్యోగులను ఆదేశించారు. కొత్త పబ్లిక్ ప్రాజెక్టులు నిర్వహించడానికి ఈ కంపెనీకి అనుమతిని రద్దు చేసింది. ఈ కంపెనీ గత 4 సంవత్సరాలుగా, రెండు మిలియన్ల మందికి ఆశ్రయమిచ్చేలా గ్రాండ్ మసీదును 4,00,000 (నాలుగు లక్షల) చదరపు మీటర్లమేరకు విస్తరించే పనిలో ఉన్న సంగతి విదితమే.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









