అమరావతి వైభవం - నవ్యాంధ్ర ఆశాకిరణం
- September 16, 2015
2015,జూన్ 6 వ తేది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించ దగినరోజు ,ఆంధ్రుల కల నవ్యాంధ్ర రాజధాని భూమి పూజ జరిగిన రోజు ,తెలుగు నేల ,తెలుగు తల్లి పులకించిన రోజు,కృష్ణమ్మ ఆనందంతో ఉప్పొంగిన రోజు ఎందుకంటే
-అమరావతి 2,200 సంవత్సరాల గత వైభవ విశిష్టత కలిగినది .
- కృష్ణమ్మ ఒడిలో అలరారిన ప్రదేశం .
- అమరావతి క్రీ . పూ 2 వ శతాబ్దంలో అశోకుని బౌద్ద స్థూపాలతో ,నాగార్జునకొండ విశిష్టత లతో , బౌద్దమతము ఫరిడవిల్లిన ప్రదేశం
- అమరావతి శిల్పకళ భారతదేశంలోని 3 శిల్పకళలలో ఒకటిగా ప్రసిద్ది చెందినది . మిగిలినవి {గాంధార & మధుర }
- ఇక్కడి అనేక శిల్ప కళా ఖండాలు ఇప్పటికి మద్రాస్ మ్యూజియం లోను ,లండన్ లోని బ్రిటిష్ మ్యూజియం లోను అమరావతి కళా సంపదగా ప్రత్యేకంగా ప్రదర్శింప బడుతుంది .
- పవిత్రమైన అమరేశ్వర ఆలయం పంచారామాలలో ఒకటిగా భాసిల్లుతున్నది .
- పురాణాల ప్రకారం దేవేంద్రుడి రాజధానిగా అమరావతిని చెపుతారు .
- ఇక్కడి పార్శ్వనాద తీర్ధ ,జైనులకు పరమ పవిత్ర క్షేత్రం .
- క్రీ . పూ 2 వ శతాబ్దంలోధరణికోటను రాజధానిగా చేసుకొని 450 సంవత్సరములు శాతవాహనులు
మహా రాజ్యాన్ని పరిపాలించిన ప్రదేశం .
- ఇక్కడి నుండే మన సంస్కృతి ,సాంప్రదాయాలు ఆగ్నేయ ఆసియా దేశాలకూ విస్తరించాయి {మలేసియా ,ఇండోనేసియా ,ఫిలిప్పేన్స్ ,థాయిలాండ్ మరియు సింగపూర్ }
- తెలుగు భాష ,సంస్కృతి ,సంప్రదాయాల పురిటి గడ్డ ఈ ప్రాంతం .
- పచ్చని వరిపొలాలతో ఆంధ్రుల అన్నపూర్ణగా నిలిచిన ప్రదేశం .
- వాడరేవు మరియు మచిలీపట్నం ఓడరేవులకు సుమారు 100 కి.మి దూరంలో సముద్ర వాణిజ్యానికి అనుకూల ప్రదేశం అమరావతి .
- అమరావతి ఆంధ్రప్రదేశ్ కు మధ్యలో అందరికి అనుకూలముగా ఉన్నది.
- ఇటువైపు 1953లో ఒకప్పటి రాజధాని కర్నూలు ఉన్నప్పటికీ ,అటువైపు అతిపెద్ద నగరం విశాఖపట్నం ఉన్నప్పటికీ ,ప్రజలు విశాల దృక్పధంతో అంగీకరించిన రాజధాని ప్రాంతం అమరవతి.
- వినూత్న పధకంలో భాగంగా భూ సమీకరణ ద్వారా తమ భూములను ,రాజధానికై ధారపోసిన రైతన్నలకు ,అన్నదాతలకు జేజేలు పలుకుతూ పాదాభివందనాలు అర్పిద్దాం .
- హేతుబద్ధం కాని విభజనలో నష్టపోయినప్పటికీ , ఆంధ్రప్రజల దృఢ సంకల్ప నిదర్శనమే సంవత్సరం లోపు నవ్యాంధ్ర రాజధానికి నాంది ,పునాది .
- కారణాలు ఏమైనప్పటికీ ,రాష్ట్రం ఏర్పడిన 60 సంవత్సరాల తరువాత కుడా నిలువనీడ లేక రాజధానిని వెతుక్కుంటున్న ఆంధ్రులలో దైర్యాన్ని నింపుతున్న అమరావతి .
- ఆంధ్రప్రదేశ్ ,అమరావతులు అక్షరాలలోనే కాక అభివృద్ధిలోనూ గణనీయమైన ప్రగతిని సాధించి మన తెలుగు ప్రజల ఆశలు ,ఆకాంక్షలు నెరవేర్చి తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిలబడుతుందని ఆకాంక్షిద్దాం.
--ఆర్.వి. రావు & వకుళ దేవి
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







